Moviesసింగిల్ థియేట‌ర్లో కోటి కొల్ల‌గొట్టిన ' గుంటూరు కారం ' .....

సింగిల్ థియేట‌ర్లో కోటి కొల్ల‌గొట్టిన ‘ గుంటూరు కారం ‘ .. ఏ థియేట‌ర్లో తెలుసా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న హ‌నుమాన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌తో పోలిస్తే అందుకోలేద‌నే చెప్పాలి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 250 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించుకున్నారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా మ‌హేష్‌బాబు మీద క్రేజ్‌తో వ‌సూళ్ల ప‌రంగా బాగానే రాబ‌ట్టింది.

సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. తాజాగా గుంటూరు కారం ఓ సింగిల్ థియేట‌ర్లో కోటి కొల్ల‌గొట్టింది. హైద‌రాబాద్‌లో సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం 17 రోజుల్లోనే ఈ సినిమా ఈ అరుదైన రికార్డ్ సాధించింది.

సుదర్శన్ 35 ఎంఎంని సాధారణంగా సూపర్ స్టార్ ఫోర్ట్ అని పిలుస్తారు. గుంటూరు కారం సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్ల‌తో ఇది మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఈ సింగిల్ స్క్రీన్లో ఏకంగా కోటి రూపాయ‌ల వ‌సూళ్లు అంటే అది సెన్షేష‌న్ అని చెప్పాలి. గుంటూరు కారం సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, జగపతి బాబు, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news