Newsనాగార్జునను చూడగానే సాయి పల్లవి ఏం చేసిందో చూడండి..అదే పద్ధతైన పెంపకం...

నాగార్జునను చూడగానే సాయి పల్లవి ఏం చేసిందో చూడండి..అదే పద్ధతైన పెంపకం అంటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న సాయి పల్లవి లాంటి మంచి పద్ధతులు కల హీరోయిన్ ఎవరూ లేరనే చెప్పాలి . ఈ మాటను ఆమె ఫ్యాన్సే కాదు మిగతా హీరోయిన్ ఫాన్స్ కూడా చెప్తూ ఉంటారు . సాయి పల్లవి చాలా ట్రెడిషనల్ గా ఉంటుందని ..ఎక్కడ వల్గారిటి ఎక్స్పోజింగ్ లేకుండా ముందుకు వెళుతుందని ఇప్పటివరకు జనాలకు తెలుసు. అయితే సాయి పల్లవి తన చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అనే విషయం ఇప్పుడే తెలుసు.

సాయి పల్లవి తాజాగా కమిట్ అయిన సినిమా “తండేల్” . అక్కినేని నాగచైతన్య తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాలో నటిస్తున్నాడు . చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . 2018 లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమా కోసం నాగచైతన్య బాగా కష్టపడుతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి .

ఈ వేడుకకు వెంకటేష్ – నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . వెంకటేష్ క్లాప్ కొట్టగా.. నాగార్జున కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాల పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే జనరల్ గా ఏ హీరోయిన్ అయినా సరే అంత పెద్ద స్టార్స్ చూడగానే వెళ్లి హగ్ చేసుకుంటుంది.. హాయ్ చెబుతుంది. కానీ ఏకంగా సాయి పల్లవి నాగార్జున వెంకటేష్ కాళ్ల మీద పడి నమస్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అది సాయి పల్లవికి తన తల్లిదండ్రులు నేర్పిన పెంపకం అని .. ఇలాంటి హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం గర్వపడాలి అని ఆమె ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news