Newsఒకే ఊరు... ఒకే థియేట‌ర్‌... వ‌రుస‌గా మూడు సార్లు కోటి... టాలీవుడ్‌లో...

ఒకే ఊరు… ఒకే థియేట‌ర్‌… వ‌రుస‌గా మూడు సార్లు కోటి… టాలీవుడ్‌లో ఒకే ఒక్క‌డు బాల‌య్య‌..!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన భగవంత్‌ కేసరి సినిమా విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రు. 135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దాటిన కేసరి రు. 65 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మూడవరంలోనూ చాలా కేంద్రాలలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరో రెండు వారాలపాటు తెలుగులో బాక్సాఫీస్ దగ్గరన్న సరైన సినిమా లేకపోవడంతో బాలయ్య సినిమాకు ఎదురు లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే బాలయ్య వరుసగా అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేస‌రి సినిమాల‌తో వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో హ్యాట్రిక్ కొట్టారు. ఎప్పుడో ముప్ఫై సంవ‌త్స‌రాల క్రితం బాల‌య్య‌కు హ్యాట్రిక్ హిట్లు ద‌క్క‌గా మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు బాల‌య్య‌కు మూడు వ‌రుస విజ‌యాలు ద‌క్కాయి. పైగా ఈ మూడు సినిమాలు అటు ఓవ‌ర్సీస్‌లో 1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఇటు ఓవ‌రాల్‌గా రు.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టాయి.

ఇది మామూలు సంచ‌ల‌నం కాద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే అనంత‌పురంలోని గౌరీ థియేట‌ర్లో బాల‌య్య చివ‌రి మూడు సినిమాలు అఖండ – వీర‌సింహారెడ్డి- భ‌గ‌వంత్ కేస‌రి మూడు కూడా రిలీజ్ అయ్యి కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టాయి. ఒకే ఊరు.. ఒకే థియేట‌ర్‌.. ఒకే హీరో.. మూడు వ‌రుస సినిమాలు ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోగా బాల‌య్య అరుదైన రికార్డ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news