Movies"ఎవ్వడు ఏం చేసినా..ఎన్ని కూసిన..మమ్మల్ని ఏం పీకలేడు".. నాగబాబు పోస్ట్ వైరల్..!!

“ఎవ్వడు ఏం చేసినా..ఎన్ని కూసిన..మమ్మల్ని ఏం పీకలేడు”.. నాగబాబు పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబుని ఎలా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే కొందరు ఆయన పెట్టిన పోస్టులను వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఆయన కొడుకు పెళ్లి జరగడం దానికి సంబంధించిన ఫోటోలు ఇండస్ట్రీలో వైరల్ అవ్వడం జరుగుతున్నాయి .

అయితే పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్ళింది. అక్కడ సరదాగా గడిపింది దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోని నాగబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసుకొచ్చారు .

“మా మధ్య ఎన్ని విభేదాలు వాదనలు రెగ్యులర్గా వచ్చిన .. మా బంధం ఎంతో ప్రత్యేకం.. మేము చేసిన పనులు మా జ్ఞాపకాలు మాత్రమే కాదు .. మా మధ్య ఏర్పడే విభేదాలు కంటే మా అనుబంధం ఎంతో ఎంతో ముఖ్యమైనది . మా రిలేషన్షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది . మా మధ్య రిలేషన్ నిజంగా చాలా బలమైనది ” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు . దీంతో నాగబాబు పోస్ట్ పై పలువురు మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ .. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తుంటే . మరికొందరు మాత్రం వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ కుసింత ఘాటుగానే ఆన్సర్ ఇస్తున్నారు . మీ ముగ్గురు కలిసి ఉంటే ఎవడు .. ఏం పీకలేడు సార్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news