Moviesఆ ఒక్క పని చేస్తే జాన్వీ కూడా మరో శ్రీదేవిలా అయిపోవచ్చు.....

ఆ ఒక్క పని చేస్తే జాన్వీ కూడా మరో శ్రీదేవిలా అయిపోవచ్చు.. ఇండస్ట్రీని కొంగు కట్టేసుకోవచ్చు..!!

శ్రీదేవి .. ఓ అతిలోకసుందరి .. ఆమె పేరు చెప్పగానే అందరికీ ఇదే గుర్తొస్తుంది . అందానికి అందం.. నటనకి నటన .. ఏ విషయంలోనూ నెగటివ్ మార్కులేని ఓ అందాల కుందనపు బొమ్మ . అది ట్రెడిషనల్ – మోడ్రెన్ అన్ని రోల్స్ చేస్తుంది . మల్టీ టాలెంటెడ్ గల ఈ హీరోయిన్ ఇప్పుడు మన మధ్య లేనప్పటికీ తన సినిమాల ద్వారా అభిమానులను ఇప్పటికి పలకరిస్తూనే ఉంది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990లో విరామం తీసుకుంది .

ఆ తర్వాత 2012లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ తో మళ్ళీ పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ ఇచ్చి కెరియర్ స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి గురించి సంచలన కామెంట్స్ చేశారు . “శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి . ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నాపై ఎంతో ప్రభావం చూపించింది . సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తినలేకపోయానని ..ఆయన గుర్తు చేసుకున్నాడు . శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు . మొదటగా డైరెక్టర్ గౌరీష్ నే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు . అప్పుడు ఆమె తన పెద్ద పెద్ద కళ్ళతో నన్ను చూసిన చూపులు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను “.

“సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని ..నేను ఆమెకు మొదటి సారి చెప్పాను .. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి . అంతేకాదు నా మాటల విన్న తర్వాత ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి . ఎందుకో తెలియదు ” అంటూ చాలా చాలా ఎమోషన్ అయ్యారు . అంతేకాదు ఇప్పుడు ఆమె కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి రావడం పట్ల స్పందిస్తూ..” శ్రీదేవి గుణాలను వారసత్వంగా పొందింది . శ్రీదేవి మరొకరు మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ .. అది తన కూతురు జాన్వికపూర్ వల్లే.. అవుతుంది. కొంచెం కష్టపడి జాన్వి కంటెంట్ ఉన్న సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరవం పేరు కచ్చితంగా ఆమెకు లభిస్తాయి .. వెండితెరపై తిరుగులేని రాణిగా ఆమె గుర్తింపు పొందుతుంది ” అంటూ ధీమాగా చెప్పుకొచ్చాడు. ప్రెసెంట్ అవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news