Moviesరాశీఖన్నాని వాడుకుని మ‌రీ టాలీవుడ్‌లో మోసం చేసిందెవ‌రు...!

రాశీఖన్నాని వాడుకుని మ‌రీ టాలీవుడ్‌లో మోసం చేసిందెవ‌రు…!

రాశీఖన్నా..అమ్మడిలో కావాల్సినవన్నీ ఉన్నా ఇప్పుడు అవకాశాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. 2013 లో మద్రాస్ కెఫే రాశి ఖన్నా మొదటి సినిమా. ఇందులో తన పర్ఫార్మెన్స్ నార్త్ ఆడియన్స్ తో పాటుగా సౌత్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

మొదటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మేకర్స్ ని బాగానే ఆకట్టుకుంది. మనం సినిమాలో చిన్న గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన రాశి అదే ఏడాది జోరు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పనిలో పనిగా ఇదే సినిమాలో టైటిల్ ట్రాక్ కూడా పాడి తనో మంచి సింగర్ అని కూడా నిరూపించుకుంది. ఇంత టాలెంట్ ఉన్న కుర్రభామని మన మేకర్స్ ఎందుకు వదులుతారు. వరుసగా మంచి ప్రాజెక్ట్స్‌లో ఛాన్సులు ఇచ్చారు.

కొన్ని మంచి కమర్షియల్ సక్సెస్ సాధించగా కొన్ని మాత్రం రాశి ఖాతాలో ఫ్లాప్స్‌గా మిగిలాయి. అయితే, మోడ్రన్ డ్రస్ వేసినా, డీసెంట్‌గా చీర కట్టినా రాశి వేడి పుట్టించింది. అయినా కొందరు నిర్మాతలు రాశి ఖన్నా కి ఇస్తామన్న ఆఫర్స్ ని మోసం చేసి మరో హీరోయిన్ కి కట్టబెట్టిన సందర్భాలున్నాయి. కొత్తగా ఏ హీరోయిన్ వచ్చినా రాశి ఖన్నా కి గండికొట్టినంత పనిచేసినట్టైంది.

ఇలా చాలా సినిమాలు రాశి చేతి నుంచి జారిపోయాయి.వాడుకున్నన్ని రోజులు వాడుకున్న నిర్మాతలు రాశి ఖన్నా కి మొండి చెయ్యి చూపించారట. ఒకదశలో హీరోలు కూడా అమ్మడిని చూసి లైట్ తీసుకున్నారని లోలోపల రాశి ఖన్నా మదనపడిందట. అటు తమిళ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చినా అక్కడ కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కున్నదని తమిళ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇంకా కసిగా కనిపించే రాశి ఖన్నా స్టార్స్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాల కోసం మాత్రం ఆవురావురంటూ ఎదురు చూస్తోంది. ఇలాంటి బబ్లీ బ్యూటీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల చేతిలో పడితే కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news