Newsచిరంజీవి అశ్వ‌నీద‌త్‌ను హ‌ర్ట్ చేశారా... ఆ కార‌ణంతోనేనా...!

చిరంజీవి అశ్వ‌నీద‌త్‌ను హ‌ర్ట్ చేశారా… ఆ కార‌ణంతోనేనా…!

టాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే విషయం చర్చికి వస్తోంది. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా బింబిసారా ఫేం మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహించే సినిమా త్వరలోనే సెట్స్ మీద‌కు వెళ్ళనుంది. చిరు మోకాలి శ‌స్త్ర‌చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న వెంటనే చిరు – వశిష్ట సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది సోషియో ఫాంటసి సినిమా. ముల్లోక వీరుడు అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్, పాత్రలు.. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను పోలి ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు వశిష్ఠ కూడా ఈ విషయాన్ని నేరుగానే ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చాక వైజయంతి మూవీస్ నుంచి లీగల్ వార్నింగ్ నోటీసు బయటికి వచ్చింది. తమ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో స్టోరీ.. కాన్సెప్ట్ పాత్రలు ఇలా దేన్నీ కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీళ్లేదని.. ఒకవేళ దానిని అతిక్రమించి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ లీగల్ నోటీసులో పెట్టారు. అశ్వినీద‌త్‌కు ఇండస్ట్రీలో చాలా మంచిది పెద్దమనిషి అన్న పేరు ఉంది. ఇలా సడన్గా ఆయన ఎందుకు సీరియస్ అయ్యారు అన్నది చాలామందికి అర్థం కావడం లేదు.

చిరంజీవి 157వ సినిమాని ఉద్దేశిస్తూ పరోక్షంగానే ఈ నోటీసులు ఇచ్చారా ? అన్న డౌట్ ఇండస్ట్రీలో చాలామందికి వస్తోంది. అశ్వినీదత్ సినిమా జగదేకవీరుడు అయితే ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమాకు ముల్లోకి వీరుడు అనే టైటిల్ అనుకుంటున్నారు.. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా హీరో వేరే లోకాలకు వెళ్లడం అక్కడ దేవత క‌న్య‌ల‌ను కలవడం… ఇలా జగదేకవీరుడు అతిలోక‌సుంద‌రి స్టైల్లోనే ఈ సినిమా కథ కూడా ఉంటుందని అంటున్నారు. అశ్వినీద‌త్‌తో చిరంజీవికి ఎప్పుడు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్.

జగదేకవీరుడు అతిలోకసుందరి – చూడాలని ఉంది – ఇంద్ర లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో పాటు జై చిరంజీవ సినిమా కూడా వచ్చింది. బయట కూడా చిరంజీవి అశ్వినీద‌త్ మధ్య ఎంతో స్నేహం ఉంది. అయితే ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న సినిమాను టార్గెట్ చేసే క్రమంలో అశ్వినీద‌త్‌ బ్యానర్ నుంచి ఎందుకు ? ఈ ప్రకటన వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. చిరంజీవి పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

ఆయన రీఎంట్రీ సినిమాయే వైజయంతి బ్యానర్లో చేస్తారని అన్నారు. చిరు రీయంట్రీ ఇచ్చి కూడా ఎనిమిదేళ్లు దాటుతుంది. తన బ్యానర్లో చిరంజీవితో సినిమా కోసం అశ్వినీద‌త్‌ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి నుంచి రిప్లై రావడం లేదు.. సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. మొత్తానికి ఈ కారణమా లేదా వేరే కారణంతోనే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం.. గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు వైజయంతి నుంచి ఈ ప్రకటన రావడంతో కూడా సందేహాలు మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news