Moviesజై బాల‌య్యా అని థియేట‌ర్లో కేక‌లు పెట్టిన చిరంజీవి ద‌ర్శ‌కుడు… (...

జై బాల‌య్యా అని థియేట‌ర్లో కేక‌లు పెట్టిన చిరంజీవి ద‌ర్శ‌కుడు… ( ఫొటో)

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ అయితే వచ్చేసింది. ఈ సినిమా చూసిన పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా బాలయ్య నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బింబిసార సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడుగా అడుగుపెట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు.

యూవీ క్రియేష‌న్స్ సంస్థ రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా ముళ్ళకి వీరుడు అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు బాలయ్య భగవంత్ కేసరి సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ సినిమా చూసేందుకు వశిష్ట థియేటర్ కి వెళ్ళాడు.

అక్కడ థియేటర్లో జై బాలయ్య జై జై బాలయ్య అంటూ కేకల వేస్తూ వశిష్ట మల్లిడి సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వశిష్ట మల్లిడి బాలయ్యకు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో కూడా అతను చెప్పాడు.
ఇక బింబిసారా సినిమా స్పెషల్ షో చూసినా బాలయ్య మనిద్దరం కలిసి పని చేద్దాం మంచి కథ రెడీ చేసుకోమని కూడా వశిష్టకు ఆఫర్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు భగవంత్‌ కేసరి రిలీజ్ సందర్భంగా ఒక అభిమానిగా థియేటర్లో సినిమా చూస్తూ వశిష్ట బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాల‌య్య న‌ట‌న‌కు సీట్లో నుంచి లేచి దండం పెట్టేస్తూ కేక‌లు వేస్తూ వ‌శిష్ట్ ఎంజాయ్ చేసిన‌ట్టుగా కూడా ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫోటోలను బాలయ్య అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news