Moviesపవన్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన .. ఆ సూపర్ డూపర్ బ్లాక్...

పవన్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన .. ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అయినట్లే అయి లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఓ స్పెషల్ క్రేజీ కాంబో నే పవన్ కళ్యాణ్ గోపీచంద్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా – విలన్ గా పలు రోల్స్ లో మెప్పించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్లే అయి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అయిపోయింది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఆ సినిమా మరేదో కాదు భీమ్లా నాయక్ . మలయాళం చిత్రం అయ్యపనుమ్ కోషియం కి అధికారిక రిమేక్ ఈ సినిమా . సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాటలు స్క్రీన్ ప్లే అందించారు . సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా ఈ సినిమాలో భీమలా నాయక్ గా పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ దక్కించుకున్నాడో.. అంతే క్రేజ్ దక్కించుకున్నాడు విలన్ గా నటించినా డానియల్ శేఖర్ ..

అదే మన రానా దగ్గుబాటి. ఇద్దరు నువ్వా నేనా అంటూ ఫుల్ పర్ఫామెన్స్ తో చించేశారు. అయితే డైరెక్టర్ ముందుగా ఈ రోల్ కోసం గోపీచంద్ ని అప్రోచ్ అయ్యారట . అయితే గోపీచంద్ ఈ పాత్ర పట్ల ఇంట్రెస్ట్ చూపించకపోవడం.. పైగా విలన్ రోల్ చేయను అని చెప్పడంతో ఈ పాత్ర పలువురు హీరోస్ వద్దకు వెళ్లి ఫైనల్లి రానా దగ్గుబాటి చేతికి చిక్కింది. మొత్తానికి డేనియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి తప్పిస్తే మరి ఎవరు సూట్ కారు అనే విధంగా నటించాడు రానా దగ్గుబాటి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news