Moviesరష్మిక మందన్నాకు నాగార్జున స్పెషల్ ఫోన్ కాల్.. అభిమానులకు కొత్త డౌట్లు..!?

రష్మిక మందన్నాకు నాగార్జున స్పెషల్ ఫోన్ కాల్.. అభిమానులకు కొత్త డౌట్లు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఛలో సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా.. ఆ తర్వాత నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్నింది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేస్తుంది. పుష్ప సినిమా తో తలరాతనే మార్చేసుకున్న రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది.

ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న రష్మిక .. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న సినిమాలోను నటించబోతుంది . ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య తో రష్మిక మిస్ చేసుకున్న కాంబోపై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆ సినిమా మరేదో కాదు బంగార్రాజు. 2016లో విడుదలైన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ అన్న విషయం తెలిసిందే .

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి పాత్రకు ముందుగా రష్మిక మందన్నాను అప్రోచ్ అయ్యారట మేకర్స్. వరుస Call sheets తో బిజీగా ఉన్న రష్మిక.. టైం కేటాయించలేకపోవడంతో ..కృతిశెట్టికి ఆఫర్ అందినట్లు తెలుస్తుంది. అంతేకాదు..నాగార్జున స్వయంగా కాల్ చేసి అడిగిన అమ్మడు నో చెప్పిందట. నాగ్ లాంటి హీరీ అడిగిన నో చెప్పింది అంటే..రీజన్ వేరే ఉంటుంది అన్న డౌట్లు కూడా వ్యక్తం చేశారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఈ సినిమాలో రష్మిక మందన్నా కానీ నటించి ఉంటే సినిమా మరింత హిట్ అయ్యేది అని చెప్పడంలో సందేహం లేదు.. బ్యాడ్ లక్ ఏం చేద్దాం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news