Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ‌ వాళ్ల‌పాలిట ఐరెన్‌లెగ్ అయ్యాడే… !

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వాళ్ల‌పాలిట ఐరెన్‌లెగ్ అయ్యాడే… !


కొన్నేళ్లుగా టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. చేసినవి తక్కువ సినిమాలే అయినా తాను ఎంచుకునే క్యారెక్టర్లతో పాటు సినిమాలు హిట్టవ్వ‌డంతో విజయ్ దేవరకొండకు యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చిన అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు మాత్రం రాలేదు. ఖుషి సినిమాను తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీస్ ఒకటి. మైత్రి మూవీస్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూడు సినిమాలు తెర‌కెక్కాయి. అయితే మూడు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

ముందుగా విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్లో వచ్చిన డియ‌ర్ కామ్రేడ్‌ సినిమా మైత్రి వాళ్లకు భారీ నష్టాలు మిగిల్చింది. ఇది మంచి సినిమానే అయినా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా చివరి దశలో ఉండగానే విజయ్ తో హీరో అనే సినిమాను మొదలుపెట్టారు. అప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏదో తేడాగా అనిపించి సినిమాను మధ్యలోనే ఆపేశారు. సినిమా మొత్తం తీసి నిండా మునగ‌డం కంటే అప్పటివరకు ఖర్చు పెట్టింది బూడిదలో పోసిన పన్నీరు అని వదిలేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఖుషి సినిమా తీశారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో వీకెండ్ తర్వాత బోల్తా కొట్టింది. ఖుషి సినిమా ఒక్క యుఎస్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మైత్రివాళ్ళు విజయ్‌తో ఎంతో ఇష్టంగా మూడు ప్రాజెక్టులు సెట్ చేస్తే మూడు వాళ్లకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news