Moviesఫైనల్లీ..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన స్వీటి.. ఇక అనుష్క లైఫ్...

ఫైనల్లీ..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన స్వీటి.. ఇక అనుష్క లైఫ్ సెటిల్ అయిపోయిన్నట్లేగా..!!

ఫైనల్లీ .. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గుడ్ న్యూస్ చెప్పేసింది స్వీటి. ఇన్నాళ్లు అనుష్క అసలు సినిమాలో నటిస్తుందా..? లేదా..? అంటూ తెగ భయపడిపోయారు అభిమానులు . అయితే నిశ్శబ్దం సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని తెరపై కనిపించబోతున్న అనుష్క .. ఆ సినిమా రిలీజ్ కి ముందే మరో సినిమాను ఫైనలైజ్ చేసింది . సెప్టెంబర్ 7న అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఇలాంటి క్రమంలోనే అనుష్క నుంచి మరో గుడ్ న్యూస్ వినిపించింది . ఫాంటసీ హర్రర్ డ్రామా కథనార్ లో అనుష్క నటించబోతుంది , రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో జై సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు . రోజిన్ తామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది . అతింద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమ తత్తు కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు .

చిన్న గ్లింప్స్ తోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . రిలీక్ అయిన గ్లింప్స్ బట్టి చూస్తే జై సూర్య ను చర్చి అధికారులకు ఖైదీగా చూపించబోతున్నట్లు కనిపిస్తుంది . కాగా అనుష్క ఈ సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు. మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన అప్డేట్ వచ్చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news