Newsవిడాకుల‌పై స్పందించిన క‌ల‌ర్స్ స్వాతి... నిజ‌మేనా...?

విడాకుల‌పై స్పందించిన క‌ల‌ర్స్ స్వాతి… నిజ‌మేనా…?

కలర్స్ స్వాతి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో బాగా ఫేమస్ అయింది. తర్వాత అష్టా చెమ్మా – త్రిపుర – కలవరమాయే మదిలో – మిరపకాయ సినిమాల్లోని నటించింది. తాజాగా నవీన్ చంద్రతో కలిసి మంత్ అఫ్ మధు సినిమాలో నటించింది. త్రిపురలో కలిసిన నటించిన నవీన్ చంద్రతో ఆమె మరోసారి కనిపించనుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో స్వాతి బిజీబిజీగా ఉంటుంది. అయితే ఈ ప్రమోషన్లలో కలర్స్ స్వాతికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఇటీవల భర్తతో డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా ? వాటిపై మీ సమాధానం ఏంటి అని అడిగారు. అయితే దీనికి స్వాతి సైతం స్పందించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ..నేను చెప్ప అంటూ తెగేసి చెప్పింది.

నేను కలర్స్ ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడు నా వయసు కేవలం 16 ఏళ్లు.. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు.. నన్ను నేను ఎలా ? ప్రజెంట్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు సోషల్ మీడియా ఉండి ఉంటే నన్ను ఫుట్బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పింది. ఒక యాక్టర్ గా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా.. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పను అని స్వాతి కట్ చేసింది.

అయితే వాస్తవంగా ఆమె విడాకులు తీసుకుందా ? లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. స్వాతి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె విడాకులపై ఉన్న పుకార్లు ఇంకా కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news