Moviesమ‌హేష్ తన‌ను వ‌దిలేస్తాడ‌ని... మోసం చేస్తాడ‌ని న‌మ్ర‌త ఎందుకు ఫీలైంది.. వీరి...

మ‌హేష్ తన‌ను వ‌దిలేస్తాడ‌ని… మోసం చేస్తాడ‌ని న‌మ్ర‌త ఎందుకు ఫీలైంది.. వీరి ప్రేమ‌లో ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ వెండితెరపై హీరో హీరోయిన్లుగా నటించి నిజ‌ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాజీ మిస్ ఇండియా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ జంట ఒకరు. టాలీవుడ్ లోనే మోస్ట్ బెస్ట్ కపుల్స్ గా ఈ జంటకు పేరు ఉంది. వీరిద్దరికి పెళ్లి జరిగి 18 సంవత్సరాలు అవుతోంది.. ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా అంతే ప్రేమతో ఉంటారు. ఇక 2000 సంవత్సరంలో కృష్ణ సొంత బ్యాన‌ర్‌ పద్మాలయ స్టూడియో పై తెరకెక్కిన వంశీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా స‌క్సెస్ కాలేదు. ఇక ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట ప్రేమ కథపై ఒక లుక్కువేద్దాం. దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమా కోసం ఒక అవుట్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 40 రోజులు పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఒక లాంగ్ షెడ్యూల్ జరిగింది. ఆ సమయంలోనే వీరు స్నేహం మరింత బలపడింది. అప్పుడే ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది.

న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాక వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. అయితే మహేష్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో నమ్రతనే ముందుగా ప్రపోజ్ చేసింది. అప్పటికే నమ్రత అంటే మహేష్ కి కూడా ఇష్టం కలగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. న‌మ్ర‌త మాత్రం తన ప్రేమను మహేష్ నిజంగా అంగీకరిస్తాడని అనుకోలేదట.. మహేష్ ప్రేమను నమ్మవచ్చా.. నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటాడా ? మోసం చేస్తాడేమో అని ఎన్నో సందేహాలు ఆమెకు ఉండేవట.

పైగా వయసులో మహేష్ కంటే నమ్రత నాలుగేళ్లు పెద్ద. పైగా మహేష్ ది టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ. అందుకే వీరి ప్రేమను తొలిత మహేష్ కుటుంబం కూడా అంగీకరించలేదు. అయితే మహేష్ సోదరి మంజుల సాయంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. న‌మ్ర‌త మ‌హేష్ లైఫ్‌లోకి వ‌చ్చాక మ‌హేష్ లైఫే పూర్తిగా మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news