Moviesమెగా కూతుళ్ల కాపురాలు కూలిపోవ‌డానికి కార‌ణం ఇదే..బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

మెగా కూతుళ్ల కాపురాలు కూలిపోవ‌డానికి కార‌ణం ఇదే..బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

సినీ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ఈ కుటుంబం నుంచే వచ్చారు. వస్తున్నారు. వారందరు కూడా టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు. ముందు మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఆ తరువాత కొడుకు రామ్ చరణ్ ని ఇండస్ట్రీలో పరిచయం చేసాడు. వీళ్ళనే కాకుండా తన అల్లుళ్లను, తమ్ముళ్ల కొడుకులను కూడా ఇండస్ట్రీ పరిచయం చేశాడు.

అయితే వీరందరూ చిరంజీవి సపోర్ట్ తోనే ఇండస్ట్రీలో వచ్చారు. కానీ అతి తక్కువ సమయంలోనే వారి టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగి అందరితో శబాష్ అనిపించుకుంటున్నారు. చిరంజీవి అందరికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలి కూడా కొన్ని ప్రైవేట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి, నాగబాబు చేసిన గారభమే ఇంతవరకు తెచ్చిందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి తన వారసులలో కొడుకులను మాత్రమే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కానీ కూతుర్లను మాత్రం అసలు ఇండస్ట్రీ పరిచయం చేయలేదు.

నాగబాబు కూతురు నిహారిక ట్రై చేసింది కానీ వర్క్ అవ్వలేదని మళ్ళీ ట్రై చేయలేదు. అయితే కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోయినా వారెప్పుడు వైరల్ అవుతూనే ఉన్నారు. కొన్ని సార్లు వీరు పరువు పోయే విధంగా ప్రవర్తించారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మెగా కుటుంబంలో మంచి ఫ్రీడమ్ ఉంటుంది. నచ్చినదే చేయొచ్చు. వాళ్లు ఏది అడిగితే కూడా ఇచ్చేవారు. అయితే కొన్ని పరువు పోయే విషయాలు జరిగినా చిరంజీవి సైలెంట్ గానే ఉన్నారు.

గతంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అప్పుడు ఇండస్ట్రీలో మొత్తం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ తన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. అలా కొంతకాలం బాగున్న ఆ జంట మళ్ళీ విడిపోగా శ్రీజ మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత రెండో భర్తతో కూడా విడాకులు తీసుకుంది. అయినా కూడా చిరంజీవి తన మళ్లీ కూతురిని దగ్గరకు తీసుకున్నాడు.

ఇప్పుడు ఇదే తప్పు నాగబాబు కూడా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగబాబు నిహారికను చాలా గారాభంగా పెంచాడు. నిహారిక కూడా ఈమధ్య తన భర్తతో దూరంగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే..రీసెంట్ గా తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి కూడా తన భర్త తనతో లేకపోవడంతో అందరు నిహారిక కూడా తన భర్తతో విడాకులు తీసుకుందని ఫిక్స్ అయిపోతున్నారు.

అయితే వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏమో తెలియదు కానీ ఇదంతా చిరంజీవి, నాగబాబు చేసిన తప్పు వల్ల జరిగిందని, వీరు కొంచెం ఈ విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటె బాగుండేదని ఇన్ని గొడవలు అయ్యేవి కావని జనాలు మాట్లాడుకుంటున్నారు. కూతుర్లను బాగా గారాబంగా పెంపడం వల్లే ఇలా జరిగింది అనుకుంటున్నారు. అత్తారింట్లో వాళ్ళకి నచ్చినట్టు ఉండలేకపోయారు అని, పైగా భర్తలను కూడా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూడటంతో సర్దుకోలేక విడిపోయారు అని అంటున్నారు. మరి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడంతో ఈ సమస్యలు వచ్చాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news