Movies"నాకు తెలుసు ..మేమిద్దరం పర్ఫెక్ట్ కపుల్ కాదు"..అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన...

“నాకు తెలుసు ..మేమిద్దరం పర్ఫెక్ట్ కపుల్ కాదు”..అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన అనసూయ..!!

బుల్లితెరపై ఎంతమంది యాంకరమ్మలు ఉన్నా అనసూయ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ షో తో కనివిని ఎరుగని గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే రీసెంట్ గానే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన అనసూయ సోషల్ మీడియాలో హాట్ హాట్ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే . అంతే కాదు ప్రముఖ స్టార్ హీరోని టార్గెట్ చేస్తూ పరోక్షంగా ట్వీట్ చేయడం ఆ హీరో ఫ్యాన్స్ అమ్మడుని ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనించాం .

అయితే అనసూయ అలాంటి వాటిని పట్టించుకోకుండా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అనసూయ తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఓ సుధీర్ఘ పోస్ట్ చేసుకొచ్చింది. జూన్ 4 న అనసూయ భరద్వాజ్ వివాహ వార్షికోత్సవం . దీంతో సోషల్ మీడియాలో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టింది . “ప్రియమైన నీక్కు.. ఇన్నాళ్లు నువ్వు నన్ను ఎలా భరించావో నాకే తెలియదు ..నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు ..నాకోసం ఎన్నో నీచమైన కామెంట్స్ ని ఫేస్ చేశావు ..కానీ నువ్వు నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు “.

“మన ప్రేమ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిలబెట్టావు.. అందుకు నీకు ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. నన్ను ఇంత ఆక్టివ్ గా ఇంత ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటున్నందుకు థాంక్స్ . నాకు తెలుసు మన ప్రేమ మధ్య చిచ్చు పెట్టడానికి ఎంతో మంది ట్రై చేస్తున్నారు. అయితే అలాంటివి నువ్వు పట్టించుకోవు. నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావా అని నేనే ఆశ్చర్యపోతున్నాను . ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాలు నిన్ను వెనకేసుకొని వస్తున్నాను . ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం.. మన ఇద్దరం ఒకరికొకరం పర్ఫెక్ట్ కాదు ..అయినా కూడా అది తెలుసుకొని కష్టసుఖాల్లో తోడుంటూ కలిసి వెళ్లిపోతున్నాం మన మధ్య ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ..హ్యాపీ యానివర్సరీ బేబీ ..ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను..” అంటూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టుకొచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news