Movies"ఆది పురుష్" హిట్ అవ్వాలని..శ్రీవారికి భారీ కానుకలు ఇచ్చిన ప్రభాస్.. ఏకంగా...

“ఆది పురుష్” హిట్ అవ్వాలని..శ్రీవారికి భారీ కానుకలు ఇచ్చిన ప్రభాస్.. ఏకంగా కోటిరుపాయలతో..

పాన్ ఇండియా హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న రెబల్ హీరో రీసెంట్గా నటించిన సినిమా “ఆది పురుష్”. జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . కాగా ఇదే క్రమంలో సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా కనీ విని ఎరుగని రేంజ్ లో చేయబోతున్నారు మేకర్స్. ప్రభాస్ ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే .

మరికొద్ది గంటల్లోనే ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేశారు మేకర్స్. చిన్న జీయర్ స్వామి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు . అంతేకాదు ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి భారీ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇదే క్రమంలో నిన్న రాత్రి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆది పురుష్ హిట్ అవ్వాలని తిరుమల కు వెళ్ళారు. ఈరోజు సాయంత్రం ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న సందర్భంగా ఇప్పటికే తిరుపతి చేరుకున్న ప్రభాస్ నిన్న రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభాస్ తెల్లటి పట్టు వస్త్రాలలో చాలా తేజస్వియనీయంగా వెలిగిపోయారు .. పంచ కట్టు – కుర్తా ధరించి భక్తిశ్రద్ధలతో కనిపించారు . అంతేకాదు ప్రభాస్ తన సినిమా హిట్ అవ్వాలని ఏకంగా వెంకటేశ్వర స్వామికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు అవుతుంది . సుప్రభాత సేవలోను ప్రభాస్ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ తిరుమల లో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news