Moviesఆ ముసలోడితో నీకు పెళ్లి వద్దు.. నీ ఫ్యూచర్ నాశనం అవుతుందని...

ఆ ముసలోడితో నీకు పెళ్లి వద్దు.. నీ ఫ్యూచర్ నాశనం అవుతుందని శ్రీదేవికి ముందే వార్నింగ్ ఇచ్చింది ఎవరు..!

మహానటి సావిత్రి తర్వాత సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఆ స్థాయిలో ప్రభావం చూపిన హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా అతిలోకసుందరి శ్రీదేవి పేరు చెప్పాలి. తమిళనాడులోని శివకాశిలో పుట్టిన శ్రీదేవి రెండున్నర దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాతో పాటు అటు బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో శ్రీదేవి అంటేనే ఒక సంచలనం శ్రీదేవి సినిమాలో ఉందంటే చాలు 60 ఏళ్ల ముసలోళ్ళు కూడా చొంగలు కార్చుకుంటూ థియేటర్లోకి వెళ్లి మరి ఆమె అందచందాలు చూసేవారు. అప్పటికే 60 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్కి జోడిగా ఆకుచాటు పిందితడిస్తే అంటూ ఆమె వేసిన స్టెప్పలు మెస్మరైజ్ చేసి పడేసాయి.

అప్పట్లో శ్రీదేవికి పురుష అభిమానులే కాదు మహిళ అభిమానులు కూడా పిచ్చపిచ్చగా ఉండేవాళ్ళు. నాజూకు నడుము అందమైన ముఖం చూసేకొద్దీ చూడాలనిపించే కళ్ళు ఆమె నడుము అందాలు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు శ్రీదేవి ఒక అపురూప సౌందర్యరాశి ఎంతోమంది ఆరాద్య‌ దేవత.
సౌత్ ఇండియాలో కెరీర్ పరంగా వీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆమె బాలీవుడ్కు వెళ్ళింది బాలీవుడ్లో అప్పటితరం స్టార్ హీరోలు అందరూ శ్రీదేవి కాల్షీట్ల‌ కోసం వెంపర్లాడేవారు.

ఈ క్రమంలోనే ఆమె కెరీర్ లో కోలుకోలేని తప్పు చేసింది అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోని కపూర్ మాయలో పడిపోయింది. అంతకుముందే ఆమె విధి చక్రవర్తితోనూ ప్రేమాయ‌ణం నడిపిందని అంటారు. మిధున ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మిధునకు దూరమైన ఆమె బోనీకపూర్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవి తల్లి రాజ్యలక్ష్మి మాత్రం నువ్వు ఆ ముసలోడి మాయలో పడిపోయావు అతడితో నీకు పెళ్లి ఎందుకు నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది.. దయచేసి అతడు మాటలు నమ్మవద్దు అని ఎంతో వేడుకునేదట.

అప్పటికే శ్రీదేవికి తల్లి ఎన్నో సంబంధాలు చూసింది ఇందులో టాలీవుడ్ హీరో రాజశేఖర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. అవేవీ ఆమెకు నచ్చలేదు వెళ్లి వెళ్లి బోనీ కపూర్ మాయలో పడిపోయింది పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ఆమె ముందు నుంచి తల్లి చాటు బిడ్డగా పెరిగింది చివర్లో ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయింది. బోనీ చెప్పిన మాటలు పిచ్చగా నమ్మేసింది తన సర్వస్వం త‌నే అనుకుని అన్నీ అర్పించేసింది. చివరకు శ్రీదేవి సంపాదించిన ఆస్తులను కూడా బోని తన అప్పులు తీర్చుకునేందుకు వాడుకున్నారు.

ఆ రోజుల్లోనే ఆమె నెలకు 25 లక్షలు వడ్డీ కట్టేదటే బోని ఏ స్థాయిలో అప్పులు చేసి శ్రీదేవిని వాడుకున్నాడో తెలుస్తోంది. చివరకు ఆమె చాలా రోజులపాటు తన బాధను ఎవరికి చెప్పుకోలేకపోయి తనలో తానే ఎంతో మనోవేదనకు గురైన పరిస్థితి.. వయసులో బోనీ కపూర్ శ్రీదేవి మధ్య చాలా అంతరం ఉంది. ఏదేమైనా శ్రీదేవి వైవాహిక జీవితంతో పాటు ఆమె మరణానికి ముందు కూడా సంతోషంగా లేదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news