Moviesమహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఆ రెండు ఫ్యామిలీ...

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఆ రెండు ఫ్యామిలీ గొడవలను టచ్ చేయబోతున్నారా?

ఘట్టమనేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ మూవీ . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు .

కాగా ఇప్పటికే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ సెట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..కథ విషయంలో మహేష్ బాబుతో సరికొత్త సాహసం చేయబోతున్నట్లు తెలుస్తుంది . అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే , యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటూ అంతా భావిస్తూ ఉంటారు .

ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ చూస్తే మనకు ఆ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది . అయితే ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..తన జోనర్ ని మారుస్తూ తన బార్డర్ ని టచ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు బడా ఫ్యామిలీస్ మధ్య జరిగిన గొడవలను తెరపై చూపించడానికి సాహసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్ వేసాడనే చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news