Moviesరెండు ఇడ్లి 200..నమ్రత రెస్టారెంట్ మెనూ చూస్తే దిమ్మ తిరిగి పోవ్వాల్సిందే…!!

రెండు ఇడ్లి 200..నమ్రత రెస్టారెంట్ మెనూ చూస్తే దిమ్మ తిరిగి పోవ్వాల్సిందే…!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ హీరోస్ చాలా తెలివిగా ఫామ్ లో ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ ద్వారా వచ్చిన డబ్బులను పలు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ వరుసలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే . కాంట్రవర్షియల్ కామెంట్స్ కి దూరంగా నటనకు దగ్గరగా ఉండే మహేష్ బాబు ..తన పని తాను చూసుకుంటూ ఉంటాడు అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

కాగా ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ..ఆ తర్వాత రాజమౌళితో మరో సినిమాకి కమిట్ అయి ఉన్నాడు . కాగా ఈ మధ్యనే భార్య పేరు మీద ఫుడ్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన మహేష్ బాబు ఆ హోటల్లో ఫిక్స్ చేసిన ధరలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్స్. మహేష్ బాబు హోటల్ అనగానే అందరూ ఎగబడి పోతున్నారు.

అయితే అక్కడ రేట్లు చూసి భయపడి పోయి వెనక్కి వచ్చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఎన్ రెస్టారెంట్ మెన్యు కార్డ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది జనాలకు. స్నాక్స్ ఐటమ్స్ ఒక్కొక్కటి 100కు పైగానే ఫిక్స్ చేశారు . కాగా మెన్యులో ఉన్న లిస్టు ప్రకారం రెండు ఇడ్లీ 90 రూపాయలు ..గుంటూరు కారం ఇడ్లీ 120 రూపాయలు.. సాంబార్ ఇడ్లీ 120 ..పూరి 170 ..మసాలా దోశ 190 ..పెసరట్టు 175 రూపాయలు ఇలా ఈ రేంజ్ లోనే కనిపిస్తున్నాయి .

నిజానికి సాధారణంగా బయట హోటల్లో కంపేర్ చేస్తే ఈ ధరలు డబుల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో ఎక్కువగా ఉన్నాయి అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు . సామాన్యులు కూడా మీ రెస్టారెంట్ కి వచ్చేలా ధరలు నిర్ణయిస్తే బాగుంటుంది మహేష్ బాబు గారు అంటూ సోషల్ మీడియాలో నమ్రత హోటల్ మెన్యూ కార్డును ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి మహేష్ బాబు అభిమానుల కోసం రెస్టారెంట్లో ఉండే ఐటమ్స్ ధరలను తగ్గిస్తాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news