Moviesమహేశ్ బాబు కి సిస్టర్ గా పెళ్లైన స్టార్ హీరోయిన్..ఆ...

మహేశ్ బాబు కి సిస్టర్ గా పెళ్లైన స్టార్ హీరోయిన్..ఆ రెండు తప్పులే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ కానున్నాయా..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “ఎస్ ఎస్ ఎం బి 28”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఘట్టమనేని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు . అయితే ఎప్పుడో పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న కొన్ని అనివార్య కారణాలు కారణంగా లేటుగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది . అయితే సినిమా స్టార్ట్ చేసిన ముహూర్తం బాగోలేదు ఏమో ఇప్పటికి రెండుసార్లు సినిమా షూటింగ్ వాయిదా పడింది. మొదటిసారి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ..రెండోసారి మహేష్ బాబు అమ్మగారు చనిపోవడం కారణంగా వాయిదా పడింది . ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుందని అంటున్నారు మూవీ మేకర్స్.

 

కాగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే ని అఫీషియల్ గా ప్రకటించారు. కాగా రెండో హీరోయిన్గా కృతిశెట్టిని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో మహేష్ బాబుకి అక్కగా ఈ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.

అక్క సెంటి మెంట్ ను ప్రధానంగా మలుచుకుంటూ మహేష్ బాబు అక్క సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకకబోతున్నట్లు తెలుస్తుంది . ఇకాడ షాకింగ్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్క రోల్ చేస్తుంది ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో కాజల్ అగర్వాల్ మహేష్ బాబుకి అక్క రోల్ లో కనిపించబోతుంది. సినిమా మొత్తం అక్క సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కి అక్కగా నటించడానికి కాజల్ ఓకే చేసిన్నట్లు సినీ వర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది .

కాగా మహేష్ బాబు కాజల్ కాంబినేషన్ లో బిజినెస్ మాన్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి జోడిని తీసుకొచ్చి తెరపై అక్క తమ్ముడు గా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నదే బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ గా అర్జునుడు అనే పేరును ఫిక్స్ చేశారట. ఆ విధంగా చూసుకున్న సినిమాకి ఈ రెండు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్లుగా మారనున్నాయి. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమా ఎలాంటి ఫ్లాప్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సేమ్ ఈ సినిమాలో కూడా అక్క సెంటిమెంట్ ఆధారంగానే తెరకెక్కింది. అయితే ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని సినీ విశ్లేషకులు ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అవ్వనున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు . మరి చూడాలి త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news