Moviesబాల‌య్య - మ‌లినేని సినిమాకు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చిన టాప్...

బాల‌య్య – మ‌లినేని సినిమాకు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చిన టాప్ ప్రొడ్యుస‌ర్‌…!

బాలయ్య కెరీర్ ఒకప్పుడు `సమరసింహారెడ్డి` సినిమాకు ముందు సినిమా తర్వాత అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత ఇటీవల కాలంలో `లెజెండ్` సినిమాకు ముందు బాలయ్య `లెజెండ్` సినిమా తర్వాత బాలయ్య అన్నట్టుగా మారింది. ఇక తాజాగా `అఖండ` తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సీనియర్ హీరోలతో మాత్రమే కాదు. ఇప్పుడున్న కుర్ర హీరోలతో పోటీపడుతూ బాలయ్య సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే `అఖండ` బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది.

200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బాల‌య్య‌ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. `అఖండ` తర్వాత బాలయ్య సినిమాల క్రేజ్ బాగా ఉంది దీనికి తోడు బుల్లితెరపై `అన్ స్టాపబుల్` షో తో బాలయ్య హిట్టు కొట్టడంతో బాలయ్య తర్వాత సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము రేపుతుంది. ప్రస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది.

కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, గ్లిమ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దుమ్ము రేపుతుంది. గతంలో బాలయ్య నటించిన `అఖండ` సినిమాను నైజాం ఏరియా వరకు నిర్మాత దిల్ రాజు రు. 10.5 కోట్లకు హక్కులు తీసుకొని పంపిణీ చేశారు. అయితే `అఖండ` ఒక్క నైజాంలోనే ఏకంగా 20 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

దీంతో ఇప్పుడు బాలయ్య తాజా సినిమాకు ఒక్క నైజం రైట్స్ కోసమే టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత ఏకంగా రు. 18 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. `అఖండ` నైజాం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే ఇది ఏకంగా రు. 8 కోట్లు ఎక్కువ. ఈ ఆఫర్ ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల మధ్య చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. బాలయ్య క్రేజ్‌ ఇటీవల కాలంలో ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పేందుకు ఈ ప్రి బిజినెస్ డీల్ ఎగ్జాంపుల్ అని కూడా ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. చాలా వరకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. పైగా ఏపీలో అప్పుడు అంత సానుకూల వాతావరణం లేదు. ఇప్పుడు మలినేని గోపీచంద్ సినిమాకు `అఖండ` రేంజ్ లో సూపర్ హిట్ టాక్ వస్తే కచ్చితంగా `అఖండ`ను మించి బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news