Moviesఅతడిని చూస్తే నార్మల్‌గా ఉండలేను.... ఆ ఇద్దరంటే క్రష్ అంటూ పవిత్రా...

అతడిని చూస్తే నార్మల్‌గా ఉండలేను…. ఆ ఇద్దరంటే క్రష్ అంటూ పవిత్రా లోకేష్ బోల్డ్ కామెంట్స్..!

టాలీవుడ్ లోని బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో పవిత్రా లోకేష్ కూడా ఒకరు. నిజానికి పవిత్ర ఒకప్పుడు కన్నడ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. తెలుగులో కూడా హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ తరవాత అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు. కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా అవకాశాలు అందుకుని ఫుల్ బిజీ అయ్యారు. ముఖ్యంగా తల్లి పాత్రలతో పవిత్ర ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే పవిత్ర గత కొద్దిరోజులుగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు నరేష్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నారు. దాంతో ఒక్కసారిగా అటు కన్నడ మీడియాలో ఇటు తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే కన్నడ నటుడితో పవిత్ర వివాహం జరగ్గా ఆమెకు ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఇక ఆ న‌టుడి కంటే ముందు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌తో కూడా ప‌విత్ర‌కు ఓ పెళ్లి అయ్యింది. ఇటు నరేష్ కు కూడా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉండటం టాలీవుడ్ లో రచ్చ లేపుతోంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే పవిత్ర గతంలో ఓ ఇంటర్వ్యూ లో బోల్డ్ కామెంట్స్ చేసారు. తను 6వ తరగతిలో ఉన్నప్పుడు గీతాంజలి సినిమా చూశానని చెప్పారు. అలాంటి టైంలో ఇలాంటి మ్యాన్ నా జీవితం లోకి రావాలని అనుకున్నా అంటూ వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో నాగార్జునపై విప‌రీత‌మైన‌ క్రష్ ఉండేది. అది క్రష్ అంటారో ఏం అంటారో తెలీదు. అదే నా ఫస్ట్ క్రష్ అంటూ ఓపెన్ అయ్యారు. అంతే కాకుండా నటుడు ప్రకాష్ రాజ్ అన్నా కూడా తనకు క్రష్ అని అన్నారు.

నాగార్జున తర్వాత అతడి పైనే క్రష్ అని చెప్పారు. ఆయన తో కలిసి చాలా సినిమాలు చేశా అని ఆయన పక్కన ఉంటే నార్మల్ గా ఉండలేక పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేశారు. ఆయనపై చాలా రెస్పెక్ట్‌ ఉండటంతో దూరంగా వెళ్లి కూర్చునేదన్ని అంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం పవిత్రా లోకేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news