Moviesమ‌హేష్ కౌగిలిలో న‌లుగుతోన్న న‌మ్ర‌త‌... బ్యూటిఫిల్ ఫిక్‌..!

మ‌హేష్ కౌగిలిలో న‌లుగుతోన్న న‌మ్ర‌త‌… బ్యూటిఫిల్ ఫిక్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించిన ఈ సినిమా జ‌స్ట్ ఓకే అనిపించుకుంది. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ గ్యాప్‌లో మ‌హేష్ తన భార్య నమ్రత, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇంత‌కు ముందే మ‌హేష్ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి అక్క‌డ కొద్ది రోజుల పాటు ఉండి వ‌చ్చాడు. అమెరికాలో ఆస్తులు కొనే ప‌నిలోనే మ‌హేష్ ఆ టూర్ వేశాడ‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇక హైద‌రాబాద్‌లోనూ మిన‌ర్వా రెస్టారెంట్ల‌తో క‌లిసి ఓ ల‌గ్జ‌రీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక స్విస్ ప‌ర్య‌ట‌న‌లో ఫ్యామిలీ స‌హా ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ చాలా హ్యాపీ మూడ్‌లో క‌నిపిస్తున్నాడు.

తాజాగా న‌మ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ ద్వారా ఓ బ్యూటిఫుల్ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో
న‌మ్ర‌త భ‌ర్త‌తో క‌లిసి ఉంది. మ‌హేష్ న‌మ్ర‌త‌ను కౌగిలించుకుని ఉన్నాడు. ఈ ఫొటోకు న‌మ్ర‌త క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. సెయింట్ మోర్టిజ్ ఇది! నథింగ్ కంపేర్ టు యూ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ బ్యూటిఫుల్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

ఈ ఫొటోను మ‌హేష్ అభిమానులు బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక మ‌హేష్ SSMB 28 లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news