Moviesవావ్‌.. మెగా - ప‌వ‌ర్ మ‌ల్టీస్టార‌ర్ రెడీ... డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

వావ్‌.. మెగా – ప‌వ‌ర్ మ‌ల్టీస్టార‌ర్ రెడీ… డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ సగం అన్నట్టుగా ఉంది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే ఏకంగా 12 మంది ఉన్నారు. ఏడాదిలో నెల‌కు సగటున ఒక్క మెగా సినిమా అయినా వ‌స్తోంది. తెలుగు సినిమా అంతా ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద బేస్ అయ్యి ఉందంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఐకాన్ అల్లు అర్జున్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ – మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఇలా స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ మెగాఫ్యామిలీలోనే ఉన్నారు. ఏడాది పొడవునా మెగా హీరోల సినిమాలు సందడి చేస్తూ వస్తున్నాయి.

ఎన్ని సినిమాలు వస్తున్న మెగా హీరోలు ఎన్ని సూపర్ హిట్లు కొడుతున్నా.. ఆ ఫ్యామిలీ హీరోల మల్టీ స్టారర్ సినిమా మాత్రం రావటం లేదు. మెగా హీరోలు ఇతర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారే… తప్ప ఏ ఇద్దరు మెగా హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయటం లేదు. తాజాగా కోలీవుడ్ లో హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటం ఈ రీమేక్‌లో న‌టించ‌డం దాదాపు ఖరారైంది.

మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి నటించ‌డం.. అందులోనూ చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకుంటే టాలీవుడ్ లో అంతకుమించిన సంచ‌ల‌నం మరొకటి ఉండదు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఓ సంచలనాత్మక కాంబినేషన్ గా మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ – చిరంజీవి సినిమా కోసం రెండు దశాబ్దాలకు పైగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. మధ్యలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

త్వరలో రిలీజ్ అయ్యే ఆచార్య తర్వాత చిరంజీవి చేతిలో నాలుగైదు సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగాభిమానుల‌కు ఫ్యీజులు ఎగిరే న్యూస్ వ‌చ్చేసింది. మెగాస్టార్ – పవర్ స్టార్ కాంబినేషన్లో సినిమాకు రంగం సిద్ధం అవుతోంది. గతంలో చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. శంకర్‌దాదా జిందాబాద్, సైరా సినిమా కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. అయితే ఈసారి మాత్రం ఫుల్ లెన్త్ రోల్‌లో పవన్ – చిరంజీవి కలిసి నటించబోతున్నారన్న‌ది టాలీవుడ్‌ తాజా ఖ‌బ‌ర్.

ఇక వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కసరత్తులు చేసి కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు ఐదారు నెలలుగా త్రివిక్రమ్ తో పాటు అతని సన్నిహితులు… సహాయకులు కలిసి రెడీ చేస్తున్న కథ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథ ఫైనల్ ర‌ష్‌ పూర్తయ్యాక చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి వినిపించి మార్పులు-చేర్పులు అనంతరం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి మెగా భాగస్వామ్యంతో ఈ సినిమా నిర్మిత మ‌వుతుందని తెలుస్తోంది. ఏదేమైనా మెగా – పవర్ ప్లానింగ్ అదిరిపోతుందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news