Moviesఫ్యాన్స్ కి మూర్ఖత్వం ఎక్కువ.. దుమారని రేపుతున్న రాజమౌళి మాటలు..!!

ఫ్యాన్స్ కి మూర్ఖత్వం ఎక్కువ.. దుమారని రేపుతున్న రాజమౌళి మాటలు..!!

రాజమౌళి..అబ్బో ఈయన కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనల్లో ఈయనకి ..ఈయన తెరకెక్కించే సినిమాలకి పిచ్చ క్రేజ్. అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడొ.. లేక ఆయన టైం అలా నడుస్తుందో తెలియడం లేదు కానీ..తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టడమే కాకుండా కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నాయి. అయితే రాజమౌళి ఎన్ని సినిమాలు తీసిన ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోవడానికి కారణం మాత్రం బాహుబ‌లి సిరీస్ అని చెప్పక తప్పదు. అంతక ముందు ఎన్ని సినిమాలు తీసిన మంచి పేరు సంపాదించుకున్నా..బాహుబలి సినిమా వేరే లెవల్.

కాగా రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో తన పేరు ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు జక్కన్న. చరణ్-తారక్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కి రీసెంట్ గా రిలీజైన చిత్రం RRR. బాక్స్ ఆఫిస్ వద్ద రికార్డ్ స్దాయిలో కలెక్షన్స్ సాధిస్తూ ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరితను తిరగరాస్తుంది. కాగా ఈ సినిమా కు సంబంధించి కొన్ని నెగిటీవ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో కావాలనే రాజమౌళి ని టార్గెట్ చేస్తూ కొందరు సినిమా పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ పత్రికా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..ప్రజెంట్ స్టార్ హీరో ఫ్యాన్స్ చాలా మూర్ఖత్వం గా ఉన్నారని..చాలా దారుణంగా బీహేవ్ చేస్తున్నారని కమెంట్ చేశాతు. అవతల మాట్లాడుతున్న వ్యక్తి “మీరు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు..మీ తో సినిమా తీయ్యడానికి స్టార్ హీరోలు కూడా..ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు.

 

మరి మీరు టాప్ హీరూలు చరణ్-తారక్ తో మల్టీ స్టారర్ సినిమా చేయ్యచ్చుగా ” అని అడగ్గా..జక్కన్న రిప్లై ఇస్తూ..”ఇప్పుడున్న ఫ్యాన్స్ మూర్ఖత్వం ఎక్కువ.. అప్పట్లో సెన్సిబుల్‌గా ఉండేవారు.. ఇప్పుడు మూర్ఖత్వంగా ఉంటున్నారు.. మా హీరో అంటూ పిచ్చి ముదిరిపోయింది..” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. నిజానికి ఈ మాటలు రాజమౌళి అప్పుడెప్పుడో అన్నాడు కానీ..RRR మీద నెగిటీవ్ ఇంపాక్ట్ పడటానికి ఆ వీడియోని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news