Moviesనాగార్జున ' మ‌న్మ‌ధుడు ' బ్లాక్‌బ‌స్ట‌ర్ వెన‌క ఇంత క‌థ న‌డిచిందా...!

నాగార్జున ‘ మ‌న్మ‌ధుడు ‘ బ్లాక్‌బ‌స్ట‌ర్ వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

టాలీవుడ్ సీనియ‌ర్ నాగార్జున‌కు నిన్నే పెళ్లాడ‌తా సినిమా నుంచి రొమాంటిక్ ఇమేజ్ వ‌చ్చింది. అయితే కె. విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున చేసిన మ‌న్మ‌ధుడు సినిమా సూప‌ర్ హిట్ అయ్యి నాగార్జున‌కు కెరీర్ చివ‌రి వ‌ర‌కు తిరుగులేని మ‌న్మ‌ధుడిని చేసేసింది. నాగార్జున ఆ త‌ర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఇప్ప‌ట‌కీ అదే మ‌న్మ‌ధుడు ఇమేజ్ కంటిన్యూ అవుతోంది. ఇక ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డానికి ముందు చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉన్నాయి.

వ‌రుస ప్లాపుల‌తో ఉన్న నాగార్జున చాలా సినిమాల త‌ర్వాత 2002 స‌మ్మ‌ర్‌లో ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సంతోషం సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా నాగార్జున‌కు ఊర‌ట ఇచ్చింది. ఆ త‌ర్వాత మ‌న్మ‌ధుడు సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు విజ‌య్‌భాస్క‌ర్ నాగార్జున‌కు వినిపించారు. ఈ సినిమాకు ముందు విజ‌య్ భాస్క‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్‌తో నువ్వునాకు న‌చ్చావ్ లాంటి సూప‌ర్ హిట్ సినిమా చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

అయితే నాగార్జున‌తో చేసే సినిమాకు ముందుగా అనుకున్న క‌థ వేరు.. అయితే ఈ సినిమాపై డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్న‌ప్పుడు క‌థ‌ను కొంత వ‌ర‌కు నాగార్జున ఇమేజ్‌కు అనుగుణంగా మార్చారు. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా మంది నిర్మాత‌లు ముందుకు వ‌చ్చినా క‌థ న‌చ్చ‌డంతో నాగార్జున స్వ‌యంగా త‌న అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు.

ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు అందించారు. త్రివిక్ర‌మ్ మాట‌ల‌కు మెస్మ‌రైజ్ అయిన నాగార్జున‌… ఆ రోజుల్లోనే త్రివిక్ర‌మ్ ఊహించ‌ని విధంగా కోటి రూపాయ‌ల‌ను కేవ‌లం త్రివిక‌మ్‌కు రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చారు. ముందుగా ఆర్తీ అర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు. కొత్త హీరోయిన్‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తే సినిమాకు ప్రెష్ ఫీల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు విజ‌య్ భాస్క‌ర్ భావించారు.

ఆయ‌న అంత‌కు ముందు డైరెక్ట్ చేసిన నువ్వునాకు న‌చ్చావ్ సినిమాతో ఆర్తీ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆర్తీ ఆ సినిమా విజ‌యంలో చాలా ప్ల‌స్ అయ్యింది. అందుకు మ‌న్మ‌ధుడు సినిమాకు కూడా కొత్త హీరోయిన్లు కావాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌ట్టారు. ఓ పాత్ర‌కు బాలీవుడ్ అందాల సుంద‌రి సోనాలిబింద్రేను తీసుకున్నారు. ఆమె అప్ప‌టికే తెలుగులో మురారి, ఖ‌డ్గం సినిమాలు చేసింది.

ఇక మ‌రో హీరోయిన్‌కు కొత్త అమ్మాయి అన్షును తీసుకున్నారు. ఈ సినిమా విజ‌యంలో వీరిద్ద‌రు చాలా అంటే చాలా ప్ల‌స్ అయ్యారు. ఇక డిసెంబ‌ర్ 20, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లోనే భారీ షేర్ రాబ‌ట్ట‌డంతో పాటు 26 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. క్లాస్ సెంట‌ర్ల‌లో ఈ సినిమాను విప‌రీతంగా ఎంజాయ్ చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు అదిరిపోయాయి.

అంద‌మైన భామ‌లు లేత మొరుపు తీగ‌లు పాట ఇప్ప‌ట‌కీ కొత్త‌గా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ సినిమా రు. 10 కోట్ల‌కు పైగా షేర్ క‌లెక్ట్ చేసింది. నాగార్జున‌కు మంచి పేరు తీసుకు రావ‌డంతో పాటు నిర్మాత‌గాను లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ రోజునే స‌చిన్‌, భావ‌న న‌టించిన నినుచూడ‌క నేనుండ‌లేను సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. ఇక డిసెంబ‌ర్ 27న మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ అన్వేష‌ణ వ‌చ్చినా అది కూడా ప్లాప్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news