Moviesయంగ్ టైగర్ సంచలన నిర్ణయం..ఆ షో కి గుడ్ బై..ఎందుకంటే..??

యంగ్ టైగర్ సంచలన నిర్ణయం..ఆ షో కి గుడ్ బై..ఎందుకంటే..??

యంగ్ టైగర్ ఎన్టీఆర్..నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..స్వర్గీయ నందమూరి తారక రామరావు మనవడిగా..టాలీవుడ్ లో తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు..యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో..ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక తారక్ హీరోగానే కాదు..హోస్ట్ గా కూడా అదరగిట్టేస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు. తెలుగులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ షో తొలి సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజ‌న్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజ‌న్లలో లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, ఛ‌రిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవ‌ల్లో నిల‌బెట్టేశాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మ‌రోసారి అదే రెంజ్ లో బుల్లితెర‌ను మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో ద్వారా షేక్ చేస్తున్నాడు.

అయితే , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఇక ఆ షో లో తారక్ కనిపించడు అంటున్నారు. ఎందుకంటే. మొదట సీజన్ పూర్తి చేసుకున్నారట. ఇప్పటికే మొత్తం ఎవరు మీలో కోటీశ్వరులు షో కి 60 ఎపిసోడ్ లను ఎన్టీఆర్ విజయవంతంగా షూటింగులు పూర్తి చేశారట. ఇక దీంతో జెమిని టీవీ వాళ్లు తారక్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..మొత్తం 60 ఎపిసోడ్ లకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్షరాల రూ.7.50 కోటి అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్ , దేవి శ్రీ ప్రసాద్,అలాగే హీరోయిన్ తమన్నా కూడా త్వరలోనే ఈ షోకి హాజరవుతున్న విషయం తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news