Moviesచరణ్ కోసం ఆ స్టార్ హీరో ని విలన్ గా మార్చిన...

చరణ్ కోసం ఆ స్టార్ హీరో ని విలన్ గా మార్చిన శంకర్.. మెగాస్టార్ సంచలన నిర్ణయం..?

బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీయార అద్వానీ నటించడం సినిమా కి మరో ప్లస్ పాయింట్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని తెలుస్తుంది. ఇక ఇందులో చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు సినీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు శంకర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భార‌తీయుడు సినిమా రేంజ్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని టాక్ రావడంతో.. ఈ బడా ప్రాజెక్ట్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఆకాశాన్నంటున్నతున్నాయి. ఇక తాజా లీకైన మ్యాటర్ బట్టి ఈ సినిమా రేంజ్ ఏ స్దాయిలో ఉండబోతుందో మనం తెలుసుకోవచ్చు.

ఈ బడా ప్రాజెక్ట్ లో రాం చరణ్ తో ఫైటింగ్ కు మ‌లయాళ స్టార్ హీరో సిద్ధమైన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యస్…ఈ సినిమాలో మ‌లయాళ స్టార్ హీరో విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. ఇప్పటి వరకు మన్మ్ చూసిన్నట్లైతే శంకర్ తీసే అన్ని సినిమాలో విలన్ పాత్రలకు ఆయన హీరో తో సమానంగా కధ బలం ఉంటాయి. ఇక చ‌ర‌ణ్ చిత్రంలో ప్రధాన విలన్ గా మలయాళం స్టార్ సురేష్ గోపీని దించాలని ఆలోచన చేస్తున్నారట. చరణ్‏తో తలపడేందుకు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించిన శంకర్ ఆయనను ఎంపిక చేసినట్లుగా టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు ఓకే చెప్పారట. మలయాళంలో పోలీస్ పాత్రలకు సురేష్ గోపి పెట్టింది పేరు. మలయాళంలో ఆయన చేసిన చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news