Moviesఎన్టీఆర్ - మ‌హేష్ ర‌చ్చ‌కు ముహూర్తం ఫిక్స్‌..!

ఎన్టీఆర్ – మ‌హేష్ ర‌చ్చ‌కు ముహూర్తం ఫిక్స్‌..!

తెలుగు సినిమా రంగంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇద్ద‌రికి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ ఇద్ద‌రు యంగ్‌స్ట‌ర్స్ ఒకేసారి ఒకే తెర‌మీద క‌నిపిస్తే స్క్రీన్ షేక్ అయిపోవాల్సిందే. అలాంటిది ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి ఒకే షోలో స్క్రీన్ మీద క‌నిపించ‌బోతున్నారు. బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోయేలా చేస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిస్తే ఎంట‌ర్టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్న షో చూసేందుకు యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కులు, సినీ అభిమానులు కూడా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు.

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఓ స్పెష‌ల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇటీవ‌లే ఈ షోకు హీరోయిన్ స‌మంత వ‌చ్చి సంద‌డి చేసింది. ఎన్టీఆర్ – స‌మంత మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు కూడా ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ గెస్ట్ సీట్లో కూర్చొనేందుకు మ‌హేష్‌బాబు రెడీ అయ్యాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. దీనిని ఎప్పుడు టెలీకాస్ట్ చేస్తారా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎదురు చూస్తున్నారు.

మ‌న‌కు విన‌డ‌పుతోన్న స‌మాచారం ప్ర‌కారం దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల ఎంట్రీతో మంచి టీఆర్పీ రేటింగ్ ఈ షోకు ద‌క్కింది. ఇప్పుడు మ‌హేష్‌బాబు కూడా ఈ షోకు వ‌స్తే అదిరిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news