Moviesఆ టైం లో ఎవరైతే నాకేంటి అనుకున్న..ఏం ఆలోచించలేదు: మనసులోని మాట...

ఆ టైం లో ఎవరైతే నాకేంటి అనుకున్న..ఏం ఆలోచించలేదు: మనసులోని మాట బయట పెట్టిన సాయి పల్లవి

సాయి పల్లవి .. హీరోయిన్స్ గ్లామర్స్ రోల్స్ కే కాదు ..కంటెంట్ ఉన్న రోల్స్ చేసి హిట్ కొట్టి..అభిమానులను సంపాదించుకోవచ్చు అని ప్రూవ్ చేసిన నటి. తెలుగులో ఫిదా ఎమట్రీ ఇచ్చిన ఈ మలయాళి బ్యూటీ..ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. నటనకు స్కోప్ ఉన్న పాత్రలనూ చూస్ చేసుకుంటూ.. వరుస హిట్ లతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఖాతలో లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి..బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా లో నాగ చైతన్య నటన అదుర్స్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా ఇది నిలుస్తుందంటున్నారు. ఇక సాయి పల్లవి మౌనిక పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఎక్కడ ఎంత చేయాలో అక్కడ అంతే చేసింది. మరీ ముఖ్యంగా నాగ చైతన్య సాయి పల్లవి మధ్యలో వచ్చే డైలాగ్స్ టైంలో సినిమా ధియేటర్స్ దద్దరిలిపోయాయి.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి తో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకున్నారో చెప్పుతూ..క్లారిటీ ఇచ్చింది. ఫస్ట్ నుండి ఆమెకు రీమేక్ సినిమాలంటే భయమట అందుకే రీమేక్ సినిమా అవడం వల్లనే చిరు సినిమా లోని పాత్రకు నో చెప్పారట. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన నటీ నటుల కంటే తాను బెటర్ గా నటిస్తానో లేదో అనే భయం తనలో ఉండ బట్టే అక్కడ మెగాస్టార్ చిరంజీవి అని తెలిసినా కూడా సినిమాను రిజెక్ట్ చేయవలసి వచ్చింది అని చెప్పుతూ.. ఆ టైంలో అక్కడ మెగాస్టార్ హీరో అని కూడా ఆలోచించలేదు అని నేను చేయకూడదు అనుకుంటే చేయను అని క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news