Moviesఅభిమానుల గోల తట్టుకోలేకే ఇలా..పంచె లేపి పవన్ తో సై..!!

అభిమానుల గోల తట్టుకోలేకే ఇలా..పంచె లేపి పవన్ తో సై..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ​ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది. ఇటీవలే పవన్​ పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం.‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా వెనకవైపు నుంచి కనిపిస్తోండగా.. పంచె లేపి ప్రత్యర్థి భీమ్లా నాయక్ తో యుద్దానికి సై అన్నట్లుగా పోస్టర్ బట్టి చూపించాడు దర్శకుడు సాగర్ కే చంద్ర.

కాగా, భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి రానాకు సంబంధించిన ఏ అప్డేట్, పోస్టర్, ఇవ్వలేదని రానా ఫ్యాన్స్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు, భీమ్లా నాయక్ ప్రత్యర్థి డానియెల్ శేఖర్ అప్డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్​.. ఈ చిత్రంతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. ఇక రానా.. త్వరలోనే ‘విరాట పర్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news