Moviesపవన్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే.. తన చేతులారా తానే నాశనం...

పవన్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే.. తన చేతులారా తానే నాశనం చేసుకున్నారు..!!

పోకిరి..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు లోని మాస్ యాంగిల్ ఈ సినిమాతోనే బయటకు వచ్చిందని చెప్పాలి. మన సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో వస్తే టీవీ కి అతుక్కుపోయి మరీ ఈ సినిమా చూస్తుంటారు. అంతలా ప్రజలను ఆట్రాక్ట్ చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా 2006లో విడుదలై టాలీవుడ్ బాక్స్ ఆఫిస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకోల్పింది. ఈ సినిమా గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మగధీర మూవీ రిలీజ్ కాకముందు వరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో హై ఎస్ట్ వసూళ్ళు సాధించిన మూవీగా రికార్డులకెక్కింది.

ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ మరియౌ డైలాగ్స్. ఈ సినిమా గుర్తుకొచ్చినప్పుడల్లా అందరికి గుర్తువచ్చే డైలాగ్.. “ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.” ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. షాకింగ్ ఏంటంటే.. ఈ సినిమా ,వచ్చి 15 ఏళ్లు దాటిన ఈ సినిమాలోని పాటలు అందరికి గుర్తుండిపోయాయి. మరి ముఖ్యంగా ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 రే సాంగ్ వచ్చినప్పుడు ముసళ్లు వాళ్లు సైతం చిందులేస్తారు అన్నడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే, మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కధను .. ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి చెప్పారట మన డాషింగ్ డైరెక్టర్ పూరి.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ ఈ కధను రిజెక్ట్ చెసాడు అని స్వయంగా పూరి ఓ ఇంటర్వ్యుల్లో చెప్పాడు. ఏదిఏమైనా పవన్ తన కెరీర్ లో ఓ మంచి బ్లాక్ బస్టర్ సినిమా ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news