Gossipsప‌వ‌న్‌తో టైం వేస్ట్... క్రేజీ ప్రాజెక్టు నుంచి స్టార్ డైరెక్ట‌ర్ అవుట్‌..!

ప‌వ‌న్‌తో టైం వేస్ట్… క్రేజీ ప్రాజెక్టు నుంచి స్టార్ డైరెక్ట‌ర్ అవుట్‌..!

పవ‌న్ క‌ళ్యాన్ తిరిగి సినిమాల్లో న‌టించ‌డం స్టార్ట్ చేశాక వ‌రుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాతో పాటు ఆ వెంట‌నే క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో జాన‌ప‌ద చిత్రం ఉండ‌నుంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ముందు వ‌కీల్‌సాబ్‌ను కంప్లీట్ చేసి ఆ త‌ర్వాత క్రిష్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించాల‌ని అనుకున్నాడు. అయితే ఇప్ప‌ట్లో ప‌వ‌న్ త‌న‌కు అందుబాటులోకి వ‌స్తాడ‌న్న న‌మ్మ‌కం లేని క్రిష్ ప‌వ‌న్ సినిమాను ప‌క్క‌న పెట్టేశాడ‌ని అంటున్నారు.

 

ప‌వ‌న్ దీక్ష చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.. ఈ దీక్ష కంప్లీట్ అయ్యాక.. క‌రోనా త‌గ్గాలి.. అప్పుడు వ‌కీల్‌సాబ్ కంప్లీట్ చేయాలి. ఇవ‌న్నీ అయ్యేలోగా తాను మ‌రో సినిమా ఫినిష్ చేసేయ‌వ‌చ్చ‌ని.. ఆ త‌ర్వాత వీలుంటే ప‌వ‌న్ సినిమా చేసుకోవ‌చ్చ‌ని క్రిష్ డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే క్రిష్ ఓ మీడియం రేంజ్ బ‌డ్జెట్ సినిమా ప్రారంభించేశాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందే సినిమాను క్రిష్ మొద‌లు పెట్టేశాడు.

 

ఈ సినిమా కూడా క్రిష్ మిగిలిన సినిమాల మాదిరిగా ఓ డిఫ‌రెంట్ సినిమాగా ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు. అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే మొదలు పెట్టేయ‌నున్నారు. ఏదేమైనా ప‌వ‌న్‌తో సినిమా ఊపులో ఉన్న ఏ డైరెక్ట‌ర్ వేరే సినిమా చేయ‌రు. కానీ క్రిష్ మాత్రం ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో గ్యారెంటీ లేకే.. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టు వ‌దిలేసి.. మ‌రో ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news