Gossipsబాలయ్యతో పైసా వసూల్

బాలయ్యతో పైసా వసూల్

ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బొంబాట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో తన క్రేజ్‌ను తిరిగి పొందాడు ఈ క్రేజీ డైరెక్టర్. సక్సెస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా ఆయన ఆకలి తీర్చిందనే చెప్పాలి. ఇప్పటికీ ఈ సక్సెస్‌ జోష్ నుండి బయట పడలేదు ఈ డైరెక్టర్. కాగా ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలను లైన్‌లో పెట్టాడు ఈ క్రేజీ డైరెక్టర్. తాజాగా తన కొడుకు ఆకాష్ పూరీతో సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, తన నెక్ట్స్ మూవీని విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నాడు.

అయితే మరో సీనియర్ హీరోతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సీనియర్ హీరో బాలకృష్ణతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయనతో పైసా వసూల్ అనే మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన పూరీ, ఇప్పుడు మరోసారి అలాంటి ఫార్ములానే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్యతో హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నాడు. దీంతో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

ఏదేమైనా పైసా వసూల్ చిత్రంతో బాలయ్య ఫ్యాన్స్‌కు పూరీ ఇచ్చిన ట్రీట్ మరవకముందే మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుందా అని ఆతృతగా చూస్తున్నారు సినీ జనం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news