Gossipsమీడియా పై సెటైర్ వేసిన నాగ్

మీడియా పై సెటైర్ వేసిన నాగ్

వ‌ర్మ – నాగ్ కాంబినేష‌న్ అంటేనే ఓ సంచ‌ల‌నం
ఇప్పుడీ సంచ‌లనం 28 ఏళ్ల త‌రువాత రిపీట్ అవుతోంది
ఆర్జీవీనే స్వ‌యంగా ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు
అల‌నాటి నాయ‌కి టాబు ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంది
ఈ సిన్మాకు సంబంధించి మీడియా ఇచ్చిన లీక్ పై నాగ్ త‌న‌దైన ధోర‌ణిలో సెటైర్ కాయిన్ చేశాడు.
ఎలా అంటే..?
అక్కినేని నాగార్జునతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ 20న ప్రారంభించనున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.అయితే ఈ విషయాన్ని ముందు తాను ప్రకటించాలనుకున్నాను.. కానీ తన కంటే ముందే మీడియా ప్రకటించేసిందని చమత్కరించారు నాగార్జున. ‘వర్మతో పోలీసు నేపథ్యంలో తెరకెక్కే స్టైలిష్‌ చిత్రంలో నటిస్తున్న ందుకు చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. నవంబర్‌ 20న చిత్రీకరణ మొదలవుతుంది. ఈ విషయాన్ని మొదట నేనే ప్రకటిద్దామనుకున్నాను. కానీ నాకంటే ముందు మీడియా వెల్లడించేసింది’ అని ట్వీట్‌ చేశారు నాగ్‌.నాగ్‌ ట్వీట్‌ ప్రకారం ఇదో పోలీస్‌ కథ నేపథ్యంలో తెరకెక్కే చిత్రమని తెలుస్తోంది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల వర్మ తెలిపారు. ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది ఆర్జీవీ ఫ్యాక్ట‌రీ ప్లాన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news