Gossipsబ్రేకింగ్‌: మ‌హేష్‌తో నాలుగో సినిమా ప‌ట్టేశాడు...

బ్రేకింగ్‌: మ‌హేష్‌తో నాలుగో సినిమా ప‌ట్టేశాడు…

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మహర్షి ఓ బెస్ట్ సినిమాగా మిగిలిపోయింది. మంచి సందేశాత్మక కథనంతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం మహేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చేసేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహర్షి ఇప్పటికే రూ. 200 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు వరల్డ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆదివారం లండన్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ఫ్యామిలీతో సహా సంద‌డి చేశాడు. ఈ మ్యాచ్‌లో మహేష్ ఫ్యామిలీతో పాటు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన నెక్ట్స్‌ సినిమా బేసిక్ లైన్ కూడా వంశి ఇప్పటికే మహేష్ కు వినిపించాడని, ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి డిస్కర్ష‌న్లు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ వంశీకి మహేష్ కమిట్మెంట్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారట. మహర్షి లాంటి సినిమాను పక్కా స్ట్రాట‌జీతో జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేయడంలో దిల్ రాజు పాత్రకు మహేష్ ఫిదా అయిపోయాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లితో తాను చేసే తర్వాత సినిమా నిర్మించే అవకాశం రాజుకే ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్‌తో ఇప్పటికే రాజు మూడు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో పాటు తాజాగా వచ్చిన మహర్షి నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మాణంలో సైతం రాజుకు వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో తానే పూర్తిస్థాయి నిర్మాతగా సినిమా నిర్మించనున్నాడు. ప్రస్తుతం రాజు కూడా లండన్‌లోనే ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news