Gossipsచిరు రికార్డ్స్ కు ఎసరు పెట్టిన ఎన్టీఆర్....ఇంకా ఎన్ని కొట్లో తెలుసా!

చిరు రికార్డ్స్ కు ఎసరు పెట్టిన ఎన్టీఆర్….ఇంకా ఎన్ని కొట్లో తెలుసా!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంచలనం జై లవ కుశ రిలీజ్ కి ముందే భారీ అంచనాలను సొంతం చేసునుంది . సెప్టెంబర్ 21 రిలీజ్ అయినా ఈ చిత్రం కేవలం ఎన్టీఆర్ అభిమానులనే కాకా తెలుగు సినీ ప్రేక్షకులందరిని మంత్రముగ్దులను చేసిందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. యంగ్ టైగర్ యాక్టింగ్ ముందు అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి . బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గ నిలిచిందని చెప్పాలి .
ఈ సినిమా ఇప్పుడు మెగాస్టార్ రికార్డ్స్ కు ఎసరు పెట్టింది .

మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ 150 ఎలాంటి రికార్డ్స్ ని క్రీయేట్ చేసిందో తెలిసిందే. టోటల్ రన్ లో ఈ చిత్రం 164 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసింది . ఈ సినిమా బాహుబలి తర్వాత స్తానం సొంతం చేసుకుంది .మరే హీరో ఈ రెకార్డ్ ను చేరుకోలేక పోయారు ఇప్పటివరకు . అయితే తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ తో ఆ రికార్డు కు టెండర్ పెట్టేసారు . ఇప్పటివరకు ఈ సినిమా 3 వ స్తానం లో నిలిచి శ్రీమంతుడిని క్రాస్ చేసినట్లు తెలుస్తుంది . 162 కోట్ల గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక కేవలం మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే ఖైదీ 150 ని కూడా క్రాస్ చేసేస్తోంది ఈ చిత్రం.

టోటల్ రన్ లో ఈ చిత్రం 166 + కోట్ల గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లో నివేద థామస్ , రాశి ఖన్నా హీరోయిన్లు గ నటించారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news