Gossipsపైసా వసూల్ నిలిపివేత - బాల్లయ్య అభిమానులు ఆగ్రహం ....

పైసా వసూల్ నిలిపివేత – బాల్లయ్య అభిమానులు ఆగ్రహం ….

బాలకృష్ణ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పైసా వ‌సూల్ సినిమా భారీగా పైస‌లు రాబడుతుంది.ఐతే నిన్న కడప జిల్లా పులివెందుల లో ఈ సినిమా నిలిపివేశారు , దానికి కారణం చిత్రం లోని అసభ్యకర  సన్నివేశాలు అనుకుంటే పొరపాటు  పులివెందులలో మూడు సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు సినిమాలు ప్రదర్శించకుండా నిలిపివేశారు.

పులివెందుల తహసీల్దార్‌ ఎల్వీ ప్రసాద్‌ సిబ్బందితో కలిసి లక్ష్మి, రాఘవేంద్ర, మారుతి థియేటర్లను పరిశీలించారు. 2008 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం రైడింగ్ చేసిన ఎమ్మార్వో అనుమతులు లేకపోవడంతో థియేటర్లో సినిమా ప్రదర్శించడం కుదరదని నిలిపివేశారు.

టికెట్‌ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రేక్షకుల ఫిర్యాదు మేరకు అధికారులు చాలా సార్లు హెచ్చరించినా థియేటర్‌ నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతో రికార్డులను పరిశీలించారు. దీంతో మూడు థియేటర్లను అనుమతులు లేవని తహసీల్దార్‌ సీజ్ చేశారు.దీంతో పైసా వసూల్ సినిమా కి వచ్చిన బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి తమ నిరసనలు తెలియజేసి నిరాశతో వెనుదిరిగారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news