Moviesగ్రాండ్ గా పెళ్లి చేసుకున్న శర్వానంద్.. హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడో...

గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న శర్వానంద్.. హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..?

ఫైనల్లీ ఎట్టకేలకు.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయిపోయారు. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి అమ్మాయి రక్షిత రెడ్డి ను ఈ ఏడాది మొదట్లో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ పెళ్లికి చాలా గ్యాప్ తీసుకున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి . దీంతో ఎట్టకేలకు వివాహం ముహూర్తాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్నారు .

జూన్ మూడవ తేదీ అనగా శనివారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది . శుక్రవారం హల్దీ – సంగీత్ ఫంక్షన్లు చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అయినా రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . అంతేనా వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది .

చాలా సరదా సరదాగా జరిగిన వీరి వివాహం తాలూకా ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో హవా మహల్ లో చాలా అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకలు జరగా.. నిన్న రాత్రి 11:00 గంటల సమయం మధ్యలో వీళ్ళిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి హనీమూన్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరూ 10 రోజులపాటు శర్వానంద్ ఫేవరెట్ ప్లేస్ ..మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్తున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీంతో కొత్తజంటకి శుభాకాంక్షలు అందజేస్తున్నారు సినీ స్టార్స్- ఫ్యామిలీ మెంబర్స్ – రాజకీయ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news