Movies"ఆది పురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ : ప్రభాస్ చేసిన ఈ...

“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ : ప్రభాస్ చేసిన ఈ బిగ్ మిస్టేక్ గమనించారా..? ఫ్యాన్స్ హర్ట్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రెబల్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే . బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ .. ఇప్పుడు ఏ సినిమా చేస్తున్న సరే పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా రీసెంట్గా ఆయన నటించిన ఆది పురుష్ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు .

దీనికోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి . అయితే కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్ నిర్వహించిన గ్రాండ్ గా సెట్ వేసిన ఆది ప్రుషు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని తప్పులు జరిగిపోయాయి. అభిమానుల కోసం ఎంతో ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ను పొరపాటున టెలికాస్ట్ చేసేసారు టెక్నికల్ టీం. దీనితో ఆది పురుష్ టీం మొత్తం డిసప్పాయింట్ అయింది. అంతేకాదు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఇంట్రడ్యూసింగ్ ల తోనే అయిపోయిందని.. సినిమాకి సంబంధించిన విషయాలను ఎక్కడ షేర్ చేసుకోలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ప్రభాస్ కోసం వేలు ఖర్చు పెట్టి పాస్ లు తీస్తే ఆయన పట్టుమంటే ఓ గంట కూడా స్టేజీ పై లేడని..సరిగ్గా మాట్లాడలేదని ..అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మొదటి నుంచి ప్రభాస్ ని ప్రదీప్ మూడు ప్రశ్నలు వేయాలి వేయాలి అంటూ చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే చివర్లో ప్రభాస్ – ప్రదీప్ మాటలు కూడా వినకుండా జై శ్రీరామ్ అంటూ స్పీచ్ ని ముగించి వెళ్ళిపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news