Newsఆడవారు జాకెట్ వేసుకోవాలా..? వద్దా..? మళ్ళీ మంట పెట్టిన సింగర్...

ఆడవారు జాకెట్ వేసుకోవాలా..? వద్దా..? మళ్ళీ మంట పెట్టిన సింగర్ చిన్మయి పోస్ట్ ..!!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ చిన్మయి పేరుకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సమంతకి డబ్బింగ్ చెబుతూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది చిన్మయి . పలు అవకాశాలతో ముందుకు వెళుతున్న సినిమా సోషల్ మీడియాలో ఏమో యాక్టివ్ గా ఉంటూ ఆడవాళ్లకు సంబంధించిన విషయాలను ఓపెన్గా డిస్కస్ చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు ఎవరైనా ఆడవాళ్ళను కించపరిచిన తక్కువగా చేసి మాట్లాడిన వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలో ఆడవాళ్లు ఈ మధ్యకాలంలో పయటలు వేసుకోవడం లేదని నిరసనగా అబ్బాయిలు పయటలు వేసుకుంటూ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఆ వీడియో పై చిన్మయి మండిపడింది . నిజానికి ఆడవాళ్లు పయట వేసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ మండిపడింది . రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞాన నందిని దేవి ఆడవాళ్లు వేసుకున్న జాకెట్ కల్చర్ని తీసుకొచ్చారని చిన్మయి ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అప్పటివరకు ఇండియన్ కల్చర్ ప్రకారం ఎవరు ఆడవారు జాకెట్ వేసుకో లేదని చీరనే జాకెట్ గా మడిచి ధరించే వారిని చెప్పుకొచ్చింది. చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్ళు షర్ట్లు , ప్యాంట్లు వదిలేసి పంచులు కట్టుకుని తిరిగితే బాగుంటుంది అని కౌంటర్ వేసింది .

అంతేకాదు తనదైనా స్టైల్ లో ఘాటుగా స్పందిస్తూ లేడీస్ కు సపోర్ట్ చేసింది . అంతేకాదు మీ అమ్మమ్మలు నానమ్మలు కూడా బ్లౌజులు వేసుకునేవారు కాదు అంటూ మండిపడింది . అంతే కాదు ప్రతి విషయాన్ని కామంతో చూస్తే అలానే ఉంటుందని మండిపడింది. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీన్ని కొందరు వల్గర్ గా క్రియేట్ చేస్తున్నారు . సింగర్ చిన్మయి దే తప్పు అంటూ ఆమెను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది ఇంతకీ అసలు ఇప్పుడు ఆడవాళ్లు జాకెట్ వేసుకోవాలా వద్దా అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సింగర్ చిన్మయి వివాదం మరింత రేంజ్ లో అగ్గిరాజుకునేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news