Moviesపెళ్లికి ముందే తండ్రి అయిపోయిన రాజ‌మౌళి... ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం...!

పెళ్లికి ముందే తండ్రి అయిపోయిన రాజ‌మౌళి… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం…!

బాహుబ‌లి సీరిస్ సినిమాలు, త్రిబుల్ ఆర్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఇమేజ్ ప్ర‌పంచ వ్యాప్తంగా వెళ్లిపోయింది. రాజ‌మౌళి ప్రస్తుతం మహేష్ తో పాన్ వరల్డ్ మూవీ కోసం పూర్తి దృష్టిపెట్టి వ‌ర్క్ చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావ‌డంతో ఇప్పుడు రాజ‌మౌళిపై మ‌రింత బాధ్య‌త పెరిగింది. తాజా సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతోంది.

ఆ ఫొటోలో జక్కన్న పూర్తి ఫ్యామిలీ కనిపించింది. రాజమౌళి కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్ లో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఈ ఫొటోలో రాజమౌళి .. ఆయన కుమార్తె మయూఖ – భార్య రమ- కోడలు పూజా ప్రసాద్ – కుమారుడు కార్తికేయ అంద‌రూ ఉన్నారు. ఫొటో అయితే చాలా క్యూట్‌గా ఉంది. జ‌క్క‌న్న సినిమా లైఫ్‌లో ఎంత బిజీ ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎంతో టైం స్పెండ్ చేస్తాడు.

ఇదిలా ఉంటే రాజ‌మౌళి పెళ్లికి ముందే తండ్రి అయిపోయాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య ర‌మ‌, కొడుకు కార్తీకేయే స్వ‌యంగా చెపుతూ ఉంటారు. రాజ‌మౌళితో పెళ్లికి ముందే ర‌మాకు మ‌రో వ్య‌క్తితో పెళ్లి అవ్వ‌డం.. కార్తీకేయ పుట్ట‌డం జ‌రిగాయి. మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన ర‌మ ఆ త‌ర్వాత అన్న సోద‌రి వ‌ల్లీ ( కీర‌వాణి భార్య‌) ఇంట్లో ఉండ‌డం.. ఆ క్ర‌మంలోనే రాజ‌మౌళితో ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగాయి.

అయితే అప్ప‌టికే కార్తీకేయ వ‌య‌స్సు 8 ఏళ్లు. ఆ టైంలో రాజ‌మౌళి త‌న‌ను కొడుకుగానే చూసుకునే వాడ‌ని… పెళ్లికి ముందే ఆయ‌న‌తో మంచి అనుబంధం ఉంద‌ని కార్తీకేయ చెప్పాడు. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే అయినా కార్తీకేయ ఇటీవ‌ల బాగా హైలెట్ చేశాడు. ఇక కార్తీకేయ జ‌గ‌ప‌తిబాబు అన్న కుమార్తె పూజా ప్ర‌సాద్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి త‌ర్వాత రాజ‌మౌళి – ర‌మ దంప‌తులు మ‌యూఖ అనే కుమార్తెను ద‌త్త‌త తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news