Moviesహమ్మయ్య..ఊపిరి పీల్చుకున్న అక్కినేని అభిమానులు..ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్..!?

హమ్మయ్య..ఊపిరి పీల్చుకున్న అక్కినేని అభిమానులు..ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్..!?

ఇది నిజంగా అక్కినేని అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంతల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో తెలిసిందే. పెళ్లికి ముందు సూపర్ హాట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ రొమాంటిక్ బ్యూటిఫుల్ కపుల్ కొన్ని అనివార్య కారణాల కారణంగా విడాకులు తీసుకున్నారు . విడాకుల తీసుకున్నప్పటి నుంచి వీళ్లిద్దరికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ.. వాళ్ళని ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి .

ఈ క్రమంలోనే నాగచైతన్య – సమంత మళ్ళీ కలుస్తున్నారని.. నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాకి వీళ్ళు కలిసి ఉన్నప్పుడే అగ్రిమెంట్ పై సైన్ చేశారని..ఆ అగ్రిమెంట్ పేపర్స్ తో ఇప్పుడు నందిని రెడ్డి వీళ్లను కలపబోతుందంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ బేబీ అనే సినిమాలో నటించిన సమంత.. ఆ టైంలోనే నాగచైతన్యతో సమంతతో కలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ తీసుకొని ..స్పాట్ లోనే అగ్రిమెంట్ పేపర్ల పై కూడా సాయం చేయించుకుందట.

కాగా ఈ అగ్రిమెంట్ చేసిన కొన్ని సంవత్సరాలకే నాగచైతన్య-సమంత విడిపోయారు . దీంతో ఆ సినిమా అటకెక్కింది. అయితే గత కొన్ని రోజుల నుంచి నందిని రెడ్డిని చైతన్య-సమంతలను కలిసింది అని ..వీళ్ళతో సినిమా తీయడానికి ఓకే చేసింది అని వార్తలు వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే మళ్లీ సమంత – నాగచైతన్య దగ్గరవుతారా అంటూ బాధపడిన కొందరు అక్కినేని అభిమానులకు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది అన్న న్యూస్ వినిపించింది. అయితే ఇక జన్మలో నాగచైతన్య-సమంత కలిసే ప్రసక్తే లేదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు . ఏం మాయ చేసావే సినిమాతో ఒకటైన ఈ జంట ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కారణంగా దూరమయ్యారు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news