Moviesహెల్ప్ చేయకపోయినా పర్లేదు..దయచేసి ఆ పని చేయకండి..రష్మి ఎమోషనల్..!!

హెల్ప్ చేయకపోయినా పర్లేదు..దయచేసి ఆ పని చేయకండి..రష్మి ఎమోషనల్..!!

రష్మి గౌతమ్ ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు, హీరోయిన్గా అవుదామని సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ..ఆ తర్వాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ సరిపెట్టుకునింది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక బుల్లితెరపై జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్ గా మారింది .అమ్మడు అదృష్టమో లేక మరేదైనా కావచ్చు జబర్దస్త్ షో పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది .దీంతో రష్మి గౌతమ్ పేరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

అయితే రష్మి గౌతమ్ ప్రజెంట్ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తుంది. మొదట ఈ షో కి సుడిగాలి సుదీర్ హోస్ట్ గా చేశారు .అయితే కొన్ని కారణాల వల్ల సుధీర్ ఈ షో నుండి తప్పుకోవడం స్వయంగా సుధీర్ రష్మీపేరును హోస్టుగా సెలెక్ట్ చేయడం.. చకచకా జరిగిపోయాయి . అంతేకాదు ప్రజెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో హోస్టుగా చేస్తున్న రష్మీ ఆ షో కోసం సుధీర్ కి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రష్మీ కెరియర్ పరంగా ఎలా ఉన్నాకాని పర్సనల్గా చాలా సెన్సిటివ్.

తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు లేక పడిన బాధలు కావచ్చు రష్మీ మనసును మరింత వీక్ చేసేసాయి . అయితే రష్మీ పూర్తి శాఖహరి కనీసం పాలు కూడా తాగదు. ఎందుకంటే పాల కోసం మూగ జీవులను హింసిస్తారని చెప్పి తన వంతు కృషి చేస్తూ పాలకు సంబంధించిన పదార్థాలను తీసుకోరు. పూర్తి వేగన్.. ఇక మాంసాహారం ముట్టనే ముట్టదు. అంతేకాదు రష్మి జంతు ప్రేమికురాలు. ఎక్కడైనా సరే జంతువులకు హాని కలిగించారంటే ఆమె అసలు ఊరుకోదు.. సోషల్ మీడియా వేదికగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.

అయితే రీసెంట్గా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో జనాలను ఆలోచింపచేస్తుంది. “మనం మనుషులుగా పుట్టాం.. కనీసం హెల్ప్ చేయకపోయినా పర్లేదు హింసించకూడదు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసే అంత స్తోమత ఉండకపోవచ్చు.. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది .ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ హింసించకండి” అంటూ తన వంతు కృషి చేస్తూ జనాలకు చెప్పుకొచ్చింది. దీంతో రష్మీ పోస్ట్ అందరిని ఆలోచింపచేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news