Moviesక‌మిట్మెంట్ అడిగిన టాలీవుడ్ స్టార్ హీరో ప‌రువు తీసేసిన కుష్బూ...!

క‌మిట్మెంట్ అడిగిన టాలీవుడ్ స్టార్ హీరో ప‌రువు తీసేసిన కుష్బూ…!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో రాణించిన ముద్దుగుమ్మలలో కుష్బూ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కుష్బూ హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించి తన నటనతో మెప్పించింది. టాలీవుడ్ లో తొలి సినిమానే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాలో నటించి ప్రేకషకులను తనవైపు తిప్పుకుంది. కుష్బూ అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో కుష్బూకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అక్కడ కుష్బూ ను ఆరాధించే వాళ్ళు సైతం ఉన్నారు అంటే ఏ రేంజ్ లో అభిమానులకు దగ్గర అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. చివ‌ర‌కు కుష్బూ అందాల‌కు ప‌డిపోయిన తమిళ వీరాభిమానులు ఆమెకు ఏకంగా గుళ్లు కట్టే వ‌ర‌కు వెళ్లిపోయారు. అప్ప‌ట్లో కుష్బూ అంటే పిచ్చి. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో నాగార్జుతోనూ న‌టించింది.

ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. చాలా మంది హీరోయిన్లు ఆ విషయాన్ని చెప్పారు. కాగా ఓ ఇంటర్వ్యూలో కుష్బూ కూడా తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు చేసింది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో అని చెప్పింది. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తనను కమిట్ మెంట్ అడిగాడు అని దాంతో తనకు కోపం వచ్చిందని చెప్పింది.

దాంతో వెంటనే మీ కూతుర్ని మా తమ్ముడి దగ్గరకు పంపిస్తే నేను కమిట్మెంట్ ఇస్తా అని చెప్పానని తెలిపింది. తాను ఇచ్చిన కౌంట‌ర్ దెబ్బ‌తో ఆ హీరో ఫేస్ మాడిపోయింద‌ని.. ఆ దెబ్బ‌తో త‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండేవాడ‌ని కూడా తెలిపింది. అయితే ఆ స్టార్ హీరో పేరును మాత్రం కుష్బూ భయ‌ట‌పెట్టలేదు. ఇక ప్రస్తుతం కుష్బూ రాజకీయాల్లో బిజీగా ఉంది. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో జాయిన్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news