Moviesమ‌హేష్‌పై మ‌న‌సు ప‌డ్డ రాశీఖ‌న్నా... ఏం కోరుకుందో తెలుసా..!

మ‌హేష్‌పై మ‌న‌సు ప‌డ్డ రాశీఖ‌న్నా… ఏం కోరుకుందో తెలుసా..!

రాశీఖ‌న్నా ఊహ‌లు గుస‌గుస‌లాడే వేళ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తండ్రి, కొడుకులను ప్రేమ‌లో ప‌డేసిన పాత్ర‌లో మెప్పించిన రాశీఖ‌న్నా ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వ‌స్తోంది. టైర్ 2 హీరోల ప‌క్క‌నే ఎక్కువుగా న‌టిస్తోన్న రాశీఖ‌న్నాకు స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు రాలేదు. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోవ‌డంతో ఆమె కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

తాజాగా ఆమె గోపీచంద్‌కు జోడీగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు హోరెత్తిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాశీఖ‌న్నా కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పుకువ‌చ్చింది. టాలీవుడ్‌లో త‌న డ్రీమ్ రోల్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుపై త‌న‌కు ఉన్న ఇంట్ర‌స్ట్ కూడా రాశీ తెలిపింది.

టాలీవుడ్‌లో ఏ హీరోతో మీరు సినిమా చేయాల‌ని కోరుకుంటున్నారు అన్న ప్ర‌శ్న‌కు రాశీ బ‌దులిస్తూ త‌న‌కు మ‌హేష్‌బాబు అంటే చాలా ఇష్టం అని.. ఆయ‌న‌తో ఒక్క సినిమా అయినా చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పింది. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌తో రాశీ ఇప్ప‌టికే న‌టించింది. దీంతో మిగిలిన స్టార్ హీరోల్లో ఇప్పుడు ఆమె మ‌న‌సు మ‌హేష్‌బాబు మీద ప‌డింది.

మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని రాశీ లాంటి వాళ్లు మాత్ర‌మే కాదు… బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఎంత‌లా ఆశ‌ప‌డ‌తారో చెప్ప‌క్కర్లేదు. ఇప్పుడున్న పొజిష‌న్లో రాశీఖ‌న్నాకు మ‌హేష్‌బాబు సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ అంటే క‌ష్ట‌మే. ఏదో సైడ్ హీరోయిన్‌గానో లేదా సెకండ్ హీరోయిన్ పాత్ర‌లో ఛాన్స్ వ‌స్తేనే గొప్ప అనుకోవాలి.

ఇక ఆమె ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా విష‌యానికి వ‌స్తే బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా హిట్ అయితేనే రాశీఖ‌న్నాకు కాస్తో కూస్తో క్రేజ్ ఉంటుంది. లేక‌పోతే మ‌ళ్లీ సినిమా ఛాన్స్ కోసం రాశీ ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news