Moviesనాటి అందాల‌ హీరోయిన్ సురభి.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

నాటి అందాల‌ హీరోయిన్ సురభి.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అనేది ఎంతో ముఖ్యం. ఇలా గ్లామర్‌తో స్టార్ హీరోయిన్‌గా రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందాల ఆరబోత చేస్తూ వరుస అవకాశాలు అందుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే మొదట్లో అందాల ఆరబోతతో అవకాశాలు అందుకున్నప్పటికీ తర్వాత మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడంలో ఫ్యూచర్ ప్లాన్ కూడా దాగి ఉంటుంది.

అందంతో పాటు నటన తో కూడిన పాత్రలు చేస్తే ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు దక్కుతాయ‌న్న ఆశ‌ల‌తో ఉంటారు. ఇలాంటి పాత్రలకు నదియా లాంటి హీరోయిన్లే ఉదాహరణ అని చెప్పాలి. ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో కేవలం అందాలను నమ్ముకొని మాత్రమే అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి ఎక్కువగా పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి చిత్రపరిశ్రమలో కనుమరుగైపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సురభి.

ఈమె ఒక హీరోయిన్ గా ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఈమె పూర్తిపేరు సురభి జావేద్ వ్యాస్. మలయాళంలో మోహన్ లాల్ సహా మరి కొంత మంది స్టార్ హీరోల సరసన నటించింది హీరోయిన్. పల్నాటి పౌరుషం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అల్లరోడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మనీ మనీ సినిమాలో నటించింది. బంగారు మొగుడు, ఎం ధర్మరాజు, న్యాయ రక్షణ, పల్నాటి పౌరుషం, కొండ పల్లి రత్తయ్య, కేటు డూప్లికేటు, డియర్ బ్రదర్ లాంటి సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఇక ఏజ్ మీద పడటంతో అవకాశాలు తగ్గినా సమయంలోనే గుజరాత్ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మేష్ వ్యాస్ ని పెళ్లి చేసుకుంది. ఆయన సరసన ఎన్నో గుజరాతి నాటకాలలో నటించింది. ఇక ఇప్పుడు హిందీ సీరియల్స్‌తో పాటు కన్నడ సీరియల్స్ కూడా చేస్తుంది. అయితే తెలుగు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా ? అని ఎదురు చూస్తుంది. ఎలాంటి పాత్రలోనైనా చేసేందుకు సిద్ధం అని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news