Moviesస్టార్ హీరోయిన్లు... అక్క చెల్లెలు టబు, ఫరా గురించి ఈ విషయాలు...

స్టార్ హీరోయిన్లు… అక్క చెల్లెలు టబు, ఫరా గురించి ఈ విషయాలు తెలుసా.. ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఒక ఫ్యామిలీకి చెందిన సొంత అక్క చెల్లెలు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలా సొంత అక్క.. చెల్లెలు హీరోయిన్లుగా నటించి ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లలో టబు, పరహ్ ఉన్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. వీరిద్ద‌రు కూడా మ‌న హైద‌రాబాదీలు కావ‌డం విశేషం. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ హైద‌రాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌ను సైతం మెప్పించిన స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.

ఇక ఇందులో ముందుగా అక్క ఫరా గురించి మాట్లాడుకుంటే పార్స్ లే అనే సినిమా ద్వారా 1985లో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. దశాబ్దకాలంపాటు ఇక ఈ అమ్మడు అక్క‌డ‌ అగ్ర తారగా హవా నడిపించింది. దాదాపు ఇక అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న అందరి సరసన నటించింది. ఇక తన నటనతో తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. మొదట విందూ దారాసింగ్ ని పెళ్లి చేసుకున్న ఫ‌రా ఆ తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి… ఆ తర్వాత సినీ టీవీ నటుడు సునీల్ టైగర్ ని పెళ్లి చేసుకుంది. ఇక తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ఒంటరి పోరాటం – విజేత విక్రం లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఇక హీరోయిన్ టబు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది. బాల‌కృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మెగాస్టార్ చిరంజీవి ఇలా చెప్పుకుంటూపోతే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కూలి నెంబర్ వన్ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే ఆమె తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సిసింద్రీ – నిన్నే పెళ్ళాడుతా – ఆవిడా మా ఆవిడే – అందరివాడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఐదు ప‌దుల వ‌య‌స్సు దాటేసినా కూడా ట‌బు ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ట‌బు ఎందుకు ? పెళ్లి చేసుకోలేద‌న్న దానిపై ప్ర‌త్యేకంగా కార‌ణాలు లేవు. అయితే టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున‌తో ఉన్న ఎఫైర్ వ‌ల్లే ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా నాగ్‌కు అంకిత‌మైపోయింద‌ని అంటారు. ట‌బు ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. ఇందుకు కార‌ణం కూడా నాగార్జున‌ను ఆమె వ‌ద‌ల‌లేక‌పోవ‌డ‌మే అని అనేవాళ్లు ఉన్నారు. ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ట‌బు ఇటీవ‌లే అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో న‌టించి మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news