Moviesబాల‌య్య - బోయ‌పాటి మ‌ళ్లీ ఫిక్స్ అయిపోండి... ప‌వ‌ర్ ఫుల్ లైన్...

బాల‌య్య – బోయ‌పాటి మ‌ళ్లీ ఫిక్స్ అయిపోండి… ప‌వ‌ర్ ఫుల్ లైన్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే కేవలం నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులు అందరికీ పెద్ద పండగ లాంటిది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో 2010లో వచ్చిన సింహా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు బాలయ్య కెరీర్ ను ఒక్కసారిగా హై రేంజ్ కు తీసుకు వెళ్ళింది. వాస్త‌వానికి ఆ సినిమాకు ముందు బాల‌య్య రేంజ్‌కు త‌గిన బొమ్మ ప‌డ‌లేదు. సింహా అప్పట్లో బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

బాల‌య్య‌కు క‌లిసొచ్చిన సింహా టైటిల్‌తో రావడంతో పాటు బోయ‌పాటి మార్క్ ప‌వ‌ర్ ఫుల్ మాస్ ట్రీట్‌మెంట్‌కు జనాలు ఊగిపోయారు. బాలయ్యను బి.గోపాల్ తర్వాత అంత పవర్ఫుల్ పాత్రలో చూపించిన ఘనత బోయపాటి కే దక్కింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2014లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా సింహాను మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. లెజెండ్ రెండు కేంద్రాల్లో 400 ఆడటంతో పాటు ఓ కేంద్రంలో 1000 రోజులు ఆడింది.

ఇక రీసెంట్‌గా వీరి కాంబోలో వ‌చ్చిన అఖండ కూడా వ‌సూళ్ల ప‌రంగా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని సూప‌ర్ హిట్ సినిమాగా నిలిచింది. అఖండ త‌ర్వాత అఖండ కు సీక్వెల్‌గా అఖండ 2 ఉంటుంద‌ని బోయ‌పాటి చెపుతూ వ‌స్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో వార్త‌లు కూడా చ‌క్కెర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు అఖండ 2 సంగ‌తేమో కాని.. వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

2024 ఎన్నిక‌ల‌కు ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ఉండాల‌ని బాల‌య్య ఇప్ప‌టికే బోయ‌పాటికి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన లెజెండ్ సినిమా హిట్ అవ్వ‌డం ఒక ఎత్తు అయితే… ఆ సినిమా ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాంచి జోష్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఆ ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఇప్ప‌ట‌కీ తెలుగు ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతూనే ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే అఖండ 2 కాకుండా లెజెండ్ స్టైల్లోనే ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తోనే ఈ సినిమా ఉండాల‌ని బాల‌య్య సూచించిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య సూచ‌న మేర‌కు బోయ‌పాటి త‌న టీంతో క‌థా క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసేశాడ‌ట‌. ప్రస్తుతం బోయ‌పాటి రామ్‌తో సినిమా చేస్తున్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య సినిమా క‌థా క‌స‌ర‌త్తులు చేసి.. ఆ త‌ర్వాత సెట్స్ మీద‌కు తీసుకు వెళ‌తారు.

ఈ లోగా బాల‌య్య ప్ర‌స్తుతం చేస్తోన్న మ‌లినేని గోపీచంద్ సినిమా పూర్తి చేసి అనిల్ రావిపూడి సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ బోయ‌పాటి సినిమాయే ఉంటుంది. ఈ సినిమా 2024 ఎన్నిక‌ల‌కు ముందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news